రాష్ట్రంలోని సమస్యలను దేశ ప్రధాని, బీజేపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తానని ఇక్కడి సమస్యలు, పరిస్థితులు వారికి వివరిస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి నుండి రాజధానిని తరలిస్తారన్న వార్తల నేపథ్యంలో ఆయన అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇవాళ కురగల్లు గ్రామస్తులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం కొండవీటి వాగు వద్ద వంతెన పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అంశంపై మంత్రులు బాధ్యతతో మాట్లాడాలని సూచించారు. రాజధాని పనుల్లో అవినీతి జరిగితే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజధానిని మార్చుతామంటూ లీకులు ఇవ్వడం సరికాదని చెప్పారు. మంత్రి బొత్స చెప్పినట్లుగా అమరావతిలో రాజధాని వద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని పవన్ అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవద్దని మాత్రనే చెప్పానని గుర్తు చేశారు.
రాష్ట్ర రాజధాని ఒక కులానికి పరిమితం కాకుడదని, ఒక ప్రాంతానికి పరిమితం అవ్వకూడదని చెబుతున్న రాష్ట్ర మంత్రులు కూడా తాము ఒక పార్టీకి చెందిన నేతలుగా వ్యవహరించ కూడదని... రాష్ట్ర ప్రజలందరికీ భవిష్యత్తు కోసం వారు పనిచేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఇప్పటికే రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయామని... ఇప్పుడు ఇలాంటి గందరగోళ నిర్ణయాలతో మరింత నష్టం చేకూరుతుందని అన్నారు. గందరగోళ నిర్ణయాలతో మరింత నష్టం చేయాలనుకుంటే... తాను కూడా బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు తమను కలవరానికి గురి చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసమే తాము భూములను ఇచ్చామని... ఏ ఒక్క పార్టీకో ఇవ్వలేదని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాజధాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచుతారా? లేదా? స్పష్టం చేయాలని అన్నారు. రాజధానిని పొలిటికల్ గేమ్ గా చూడొద్దని... రాజధానిని తరలించడానికి జనసేన ఒప్పుకోదని చెప్పారు. రాజధానిపై ప్రకటన చేసేముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని బొత్సకు సూచించారు. రాజధాని ప్రాంత రైతులకు తాను అండగా ఉంటానని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more