ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిని విజయవాడ-గుంటూరు ప్రాంతం ప్రభుత్వం సమాలోచనలు జరుపుతుందని రాష్ట్ర మంత్రి బొత్సా సత్యనారాయణ రగిల్చిన నిప్పు రాజుకుంటూ మరింత వేగంగా రాజకీయ కలకలం కూడా రేపింది. రాజధాని ప్రాంతం ఎంపిక నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని బొత్సా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అటు రాష్ట్రమంత్రులు... ఇటు బీజేపీ ఎంపీలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
దీనికి బదులుగా మళ్లీ మీడియా ముందుకు వచ్చిన బొత్సా.. ఆధారాలతో పాటుగా సుజనా కుటుంబానికి చెందిన ఆస్తుల చిట్టాను బయటపెట్టాడు. అయితే అన్ని ఇలా మీడియా ఎదుల బయట పెట్టడం బావ్యం కాదన్న ఆయన మచ్చుకు కొన్ని ఆస్తుల వివరాలను మీడియా సాక్షిగా ప్రకటించి.. బీజేపి నేతకు షాక్ ఇచ్చారు. ఒక్క సెంటు భూమి ఉందని నిరూపించాలన్న ఆయన సవాల్ ను చేతల ద్వారానే స్వీకరించిన బొత్సా ఏకంగా 124 ఏకరాల భూమికి సంబంధించిన రాజధాని భూముల వివరాలను బయటపెట్టారు. అంతేకాదు గత అధికార పార్టీ చేసిన కారుచౌకగా కట్టబెట్టిన భూముల వివరాలను కూడా వెల్లడించారు.
సుజనా చౌదరి అన్న కుమారుడు జితిన్ కుమార్ కంపెనీ పేరు మీద చందర్లపాడు మండలంలో 110 ఎకరాలు ఉందని... ఆయన సోదరుడి కుమార్తెకు 14 ఎకరాలు ఉందని ఆయన వివరించారు. చంద్రబాబు వియ్యంకుడు వియ్యంకుడికి రాజధాని ప్రాంతంలో ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయించారని బొత్స ఆరోపించారు. రాజధాని పేరుతో జరిగిన అవినీతి, కుంభకోణాలను బయటపెడతామని అన్నారు. లోకేశ్ తోడల్లుడు తండ్రికి కూడా రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయని బొత్స వ్యాఖ్యానించారు. ఏపీఐఐసీ నుంచి 500 ఎకరాల భూమిని కారుచౌకగా అప్పగించి.. ఆ తరువాత దానిని రాజధాని ప్రాంతంలో కలిపారని.. ఈ విషయం నిజం కాదా.? అంటూ బొత్స నిలదీశారు.
రాజధాని విషయంలో అవినీతి జరిగిందనడానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలని అన్నారు. రాజధాని అంటే కేవలం ఒక సామాజికవర్గానికి చెందినదిగా ఉండొద్దని... అన్ని ప్రాంతాల వారికి ఉండాలని బొత్స అన్నారు. గతంలో రాజధాని ప్రాంతంలో అవినీతి జరిగిందని ఆరోపించిన బీజేపీ... ఇప్పుడెందుకు మాట మార్చిందో అర్థం కావడం లేదని బొత్స అన్నారు. అమరావతిలో భూముల ధరలు తగ్గాయో లేవో తెలియదు కానీ... రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం భూముల ధరలు పెరిగాయని బొత్స అన్నారు. అమరావతిలో కొన్ని మినహా అన్ని తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే అని మంత్రి బొత్స తెలిపారు. చంద్రబాబులా తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోమని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more