జార్ఖండ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. రాష్ట్రంలోని కుబాయ్ ప్రాంతంలోగల సరాయ్ కెల్లా సమీపంలో వెళుతున్న భద్రతా సిబ్బంది కాన్వాయ్ లక్ష్యంగా చేసుకుని శక్తిమంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో 8 మంది కోబ్రా జవన్లు, ముగ్గరు జార్ఖండ్ పోలీసులు గాయలపాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. ఈ తెల్లవారుజామున ఘటన జరుగగా, తమ కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లు టార్గెట్ గా చేసి మవోయిస్టులు బాంబులు పేల్చారు.
ఇవాళ తెల్లవారు జామున 4.30 నిమిషాలకు ఖార్సవాన్ జిల్లా సరాయికెల్లా గ్రామ పరిధిలోని కుచాయి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తూన్న పోలీసులను టార్గెట్ గా చేసుకుని మావోలు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. ఈ దాడిలో 209 బెటాలియన్కు చెందిన ఎనిమిది మంది కోబ్రా జవాన్లు, ముగ్గురు జార్ఖండ్ పోలీసులు చనిపోయారు. బాంబు పేలుడు దాటికి గాయపడినవారిని హెలికాప్టర్లో రాంచీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. మావోయిస్టుల కోసం గాలిస్తుండగా ఈ పేలుడు జరిగింది.
బాంబు విస్పోటనం జరిగిన సమాచారం అందుకున్న భద్రతా దళాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరకుని.. ఎయిర్ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను స్థానిక అసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా 11 మంది జవానల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా వుందని అధికారులు తెలిపారు. ఇక ఘటనాస్థలానికి అదనపు బలగాలను పంపించారు ఉన్నతాధికారులు.. మావోయిస్టుల కోసం విసృతంగా గాలిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావటంతో.. ఏం జరుగుతుందనే టెన్షన్ నెలకొంది. ఇటీవల కాలంలో మావోలు - జవాన్ల మధ్య తరచూ కాల్పులు కూడా జరుగుతున్నాయి.
Jharkhand: An IED exploded at 4:53 am today in Kuchai area of Saraikella on the troops of 209 CoBRA and Jharkhand police who were out on special operations. 8 CoBRA personnel & 3 Jharkhand police personnel injured. The injured jawans have been brought to a hospital in Ranchi. pic.twitter.com/rO31QkbAXc
— ANI (@ANI) May 28, 2019
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more