ప్రచండ భానుడి ఉగ్రరూప సరిగ్గా రోహిణి కార్తె సంక్రమించే రోజుల్లో అత్యంత అధికంగా వుంటుందని పెద్దలు చెప్పిన మాటలు ఈ సారి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అసలే మండతున్న ఎండలతో రాజస్థాన్ ఇసుకదిబ్బలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. జైసల్మేర్ సరిహద్దు ఔట్ పోస్టు సమీపంలో ఏకంగా 52.4 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. జైసల్మేర్ తరువాత దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోని రామగుండుంలో రెండో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయ్యాయి.
మే 27వ తేదీ రికార్డ్ స్థాయిలో టెంపరేచర్ నమోదు అయ్యింది. 47.4 డిగ్రీల ఎండతో.. ప్రజలు అల్లాడిపోయారు. రామగుండం అగ్నిగుండంలా మండిపోయింది. ఉత్తర వాయువ్య దిశ నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే.. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్లలోనూ ఎండలు సెగలు పుట్టించాయి. ద్రోణుల ప్రభావం, ఎండ తీవ్రతకు చెదురుమదురుగా వర్షాలు కురిసినా ఉష్ణోగ్రతల తాకిడికి క్షణాల్లోనే ఆవిరైపోతున్న పరిస్థితి. సాధారణంగా వడగాడ్పులు వీస్తున్న ఈ క్రమంలో ఎండ తీవ్రత కూడా నాలుగైదు రోజులు కొనసాగి ఆ తర్వాత కొద్దిగా తగ్గుముఖం పడుతాయి.
కానీ..2019లో మార్చి నుంచి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరగటమే తప్ప తగ్గడం లేదు. గాలిలో తేమ శాతం కనిష్ఠానికి పడిపోవడం, సూర్యప్రతాపం తీవ్రత పెరగటంతో ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయని నిపుణులు అంటున్నారు. గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటేనే వేసవిలో వర్షాలు కురిసే అవకాశముంటుంది. కానీ ఈవేసివిలో అటువంటి వాతావరణం లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కాగా రానున్న రెండుమూడు రోజుల్లో వాయవ్య, మధ్యభారతంలో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రచండ భానుడి దెబ్బకు రోజువారీ పనిచేసుకునేవారైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క సోమవారం రోజే ఎండ దెబ్బకు రాష్ట్రంలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బకు గురై సూర్యాపేట జిల్లాలో ముగ్గురు, యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురు, నల్లగొండ జిల్లాలో ముగ్గురు, కరీంనగర్ జిల్లాలో ముగ్గురు, సిరిసిల్ల, కుమరంభీం జిల్లాల్లో ఒకరు, పెద్దపల్లి జిల్లాలో ఐదుగురు, భద్రాద్రి జిల్లాలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో ముగ్గురు, జనగామ జిల్లాలో ముగ్గురు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు, ములుగు జిల్లాలో ఇద్దరు, నాగర్కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు చనిపోయారు. శరీరం చెమటపట్టకపోవడం లేదా పొడిబారడం, ఎర్రగా కందిపోవడం, తలనొప్పి, దురదలు, వాంతులు లక్షణాలను బట్టి వడదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎండల సమయంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more