రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే నామినేడేట్ పోస్టుల్లో వున్న పార్టీ నేతలు ఆయా పదవులకు రాజీనామాలు సమర్పించడం పరిపాటిగా వస్తున్న క్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ పదవిపై మాత్రం టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ బెట్టు వీడటం లేదు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవిలో కొనసాగుతున్న ఆయన రాజీనామా విషయంలో మాత్రం ససేమిరా అంటున్నారు. అంతేకాదు తన రాజీనామా కోరే హక్కు ఎవరికీ లేదని, ఈ విషయంలో ఆయన ఏకంగా ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నారు. దీంతో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే రసాభాసగా మారింది.
ప్రభుత్వానికి దమ్ముంటే టీటీడీ బోర్డును ప్రభుత్వం రద్దు చేసుకోవచ్చన్న సవాల్ విసిరారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తరుణంలోనే టీటీడీ బోర్డు సమావేశం నుంచి బయటకు వచ్చిన ఓ సభ్యుడు తాను తన పదివికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. మూడు రోజుల క్రితం బోర్డు సమావేశం జరగాల్సి వున్నా ఇవాళ్టికి వాయిదా పడింది. కాగా ఈ ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన సమావేశం జరిగింది. టీటీడీ బోర్డు సమావేశం కావాలని ముందే నిర్ణయించామని, కానీ అధికారులు హాజరుకాలేదని ఆయన విమర్శించారు.
సమావేశం అదుపుతప్పిన వేళ, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓలు మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. బోర్డు సభ్యుడు తెల్లాబాబు, తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో బోర్డు సభ్యులంతా తప్పుకోవడం నైతికతని ఆయన చేసిన వ్యాఖ్యలు సమావేశంలో వేడిని రగిల్చాయి. టీటీడీ ఉద్యోగులు బోర్డుకు ఎంతమాత్రమూ సహకరించలేదని కొందరు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న వేళ, ఇలా సమావేశాలు నిర్వహించడం సరికాదని, ఈఓ వెంటనే బోర్డును రద్దు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఎవరు రాజీనామా చేసినా తాను మాత్రం చేయనని చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తమను నియమించిందని, తాము బోర్డులోకి వచ్చామని, తమ పదవీ కాలం ఇంకా ఉందని ఈ సందర్భంగా పుట్టా గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం బోర్డును రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న తరువాత మాత్రమే తాను పదవిని వీడుతానని ఆయన అన్నారు. స్వచ్ఛందంగా బోర్డును వీడేందుకు అత్యధిక సభ్యులు సుముఖంగా లేరని తెలిపారు. కాగా, నేటి పాలకమండలి సమావేశం జరిగిన తీరును ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అడిగి తెలుసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more