Brace up, heat wave coming, warns IMD తెలంగాణలో నిప్పుల కిలిమి.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Heat wave warning issued in telugu states for next 48 hours

India Meteorological Department, heat wave, weather-report, warning, summer, on-april-27-28, heatwave, telangana, Andhra Pradesh

The Indian Meteorological Department (IMD) has issued a heat wave warning in Telangana for Monday, May 6th and Tuesday May 7th. Heat wave may continue up till 10th. According to IMD, heat wave conditions are likely to prevail over Telugu state.

భానుడి భగభగలు.. వడగాల్పుల హెచ్చరికలు

Posted: 05/06/2019 12:15 PM IST
Heat wave warning issued in telugu states for next 48 hours

తెలుగు రాష్ట్రాలపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నిప్పుల కొలిమిలా ఎండను కురిపిస్తూ ప్రజలను అల్లాడిస్తున్నాడు. తెలంగాణలో భగభగలతో ప్రజలు భయటకు వచ్చేందుకే జంకుతున్నారు. కాగా అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫణి తుపాను ప్రభావంతో వర్షాలు కురిసిన పలు ప్రాంతాల్లో కొంత ఉపశమనం లభించినా.. తుఫాను అటు వెళ్లిందో లేదో, ఇటు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోడ్లు నిప్పుల కొలిమిలా మారుతుంటే వడగాలులు ముఖంపై చాచికొడుతున్నాయి. భానుడి ప్రకోపానికి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

నిజానికి ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వేసవిలో ఉష్ణోగ్రతల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. అయితే, ఈసారి మాత్రం అటువంటి తేడాలు ఏమీ కనిపించడం లేదు.  కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమవుతున్న వేడిమి సాయంత్రమైనా తగ్గుముఖం పట్టడం లేదు.  ఆదివారం కృష్ణా, గుంటూరుతోపాటు ఉభయగోదావరి, నెల్లూరు జిల్లాల్లో వడగాలులు ప్రజలను ఇక్కట్లకు గురిచేశాయి. తెలంగాణలోనూ భానుడి ప్రతాపం కొనసాగుతోంది.

రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఆదివారం సాధారణం కంటే  5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. అనేక ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పోలవరంలో రెండు రోజులుగా 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం పది గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని  వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

దీనికి తోడు అటు వాతావరణ కేంద్ర అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. నేడు, రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం చేశారు. సోమ, మంగళవారాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రెండు రోజులు ఉష్ణోగ్రతల్లో అసాధారణ మార్పులు ఉంటాయని, వడగాలులు తీవ్రం అవుతాయని అధికారులు హెచ్చరించారు. ఈనెల పదో తేదీ వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles