ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆయన తన అనుచరులతో కలసి నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలో ఓ యువకుడు ఆయన చెంపను చెళ్లుమనిపించాడు. ఈ ఘటనతో ఢి్ల్లీలో పోలీసుల భద్రత ఎంత పటిష్టంగా వుందో మరోసారి రూడీ అయ్యింది. దేశ రాజధానిలో.. ఆ ప్రాంత ముఖ్యమంత్రికే భద్రత కరువైంది. ఓ గేుర్తు తెలియని యువకుడు ఏకంగా ముఖ్యమంత్రి ఎన్నికల ర్యాలీలోకి చోచ్చుకోచ్చి.. ఆయన వాహనం ఎక్కి మరీ ఆయనపై దాడికి పాల్పడుతున్నా.. పోలీసులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని మోతీ నగర్ కాలనీలో రోడ్ షో నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి కేజ్రీవాల్పై చేయి చేసుకున్నాడు. కేజ్రీవాల్ చెంప మీద కొట్టాడు. ఓపెన్ టాప్ జీప్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రెడ్ కలర్ టీ షర్ట్ ధరించిన వ్యక్తి ముందు వైపు నుంచి జీప్ ఎక్కి.. కేజ్రీవాల్ ను చెంప దెబ్బ కొట్టాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో అరవింద్ కేజ్రీవాల్ హతాశులయ్యారు. ఆయనతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా షాక్ కు గురయ్యారు.
వెంటనే తేరుకున్న కేజ్రీవాల్ అనుచరులు, ఆప్ నాయకులు దాడి చేసిన యువకుడ్ని కిందకు లాగి కొట్టారు. అప్పటి వరకు ఎక్కడున్నారో తెలియని పోలీసులు మాత్రం.. మేమున్నామంటూ జోక్యం చేసుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని మోతీ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. గతంలోనూ కేజ్రీవాల్ పై ఇలాంటి భౌతిక దాడులు జరిగినా.. వాటి విచారణ ఎంత వరకు వచ్చిందో తెలియలేదు. ఇక ఈ సారి పోలీసులు ఏం తేల్చనున్నారో వేచి చూడాలి. కాగా, ఎన్నికల ప్రచారంలో బీజేపీని విమర్శించినందుకు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
#WATCH: A man slaps Delhi Chief Minister Arvind Kejriwal during his roadshow in Moti Nagar area. (Note: Abusive language) pic.twitter.com/laDndqOSL4
— ANI (@ANI) May 4, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more