నగరంలోని ఆర్టీసీ బస్సులో తుపాకీ కాల్పలు కలకలం రేపాయి. సికింద్రాబాదు నుంచి ఫిల్మ్ నగర్ ప్రాంతానికి వెళ్తున్న బస్సులో పంజాగుట్ట వద్ద గన్ ఫైరింగ్ చోటుచేసుకుంది. బస్సు దిగిపొమ్మన్నందుకు ఓ వ్యక్తి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. గన్ తీసి ఫైరింగ్ చేశాడు. బుల్లెట్ బస్సు రూఫ్ టాప్ నుంచి దూసుకుపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రయాణికులతో పాటు బస్సు డైవ్రర్, కండక్టర్ కూడా భయాందోళనకు గురయ్యారు. ఇంతకీ కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరన్న విషయమై పోలీసులు విస్తృతంగా అన్వేషిస్తున్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని కిందకు దిగాలని అడిగినందుకు ఫుట్ బోర్డుపై నిలబడి ప్రయాణం చేస్తున్న వ్యక్తి రెచ్చిపోయాడు. బస్సు దిగేదిలేదంటూ తోటి ప్రయాణికులతో గొడవపడ్డాడు. అంతే కాదు తన దగ్గరనున్న గన్తో ఒక్కసారితో కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో షాక్కు గురైన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అందరినీ గన్తో బెదిరించిన దుండగుడు.. ప్రయాణికులతో గొడవపడి.. ఆ తరువాత బస్సు దిగివెళ్లిపోయాడు. ప్రస్తుతం సూట్ వేసుకున్న వ్యక్తి గూరించి పోలీసులు గాలిస్తున్నారు.
సికింద్రాబాదు నుంచి ఇవాళ ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో బయలుదేరిన సిటీ ఆర్డీసీ బస్సు.. ఫిల్మ్ నగర్ వెళ్తోంది. సిటీ సర్వీసు 47L బస్సు బోర్డుతో (AP28Z4468) నెంబరుతో వెళ్తున్న ఈ బస్సు.. పంజగుట్ట శ్మశాన వాటిక వద్దకు చేరుకోగానే ఈ ఘటన చోటచేసుకుంది. కాల్పుల్లో బస్సు టాప్కి రంధ్రాలు పడినట్టు తెలుస్తోంది. అయితే, కాల్పులతో హడలిపోయిన డ్రైవర్ బస్సును ఎక్కడా నిలపకుండా ఫిల్మనగర్ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా, ఘటనపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ యాకూబ్ పాషా గానీ, కండక్టర్ భూపతి కానీ.. బాధితుడు గానీ ఫిర్యాదు చేయలేదు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి.
కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ డ్రెస్లో ఉన్నాడని ప్రయాణికులు తెలిపారు. దీంతో కాల్పులు జరిపింది నాయకులకు సెక్యూరిటీగా వుండే గన్ మెన్లా.. లేక బౌన్సర్లా అన్నది తెలియాల్సి వుంది. ఈ ప్రాంతంలో అనేక స్టార్ హోటళ్లు కూడా వుండటంతో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఇక గన్ కు లైసెన్సు వుందా.? అన్నది కూడా తేలాల్సి వుంది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు బస్సుతో పాటు కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more