YS Jagan comments on return gift to chandrababu naidu చంద్రబాబుకు రిట్నార్ గిప్ట్ పై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Ys jagan intresting comments on return gift to chandrababu naidu

ys jagan on return gift, ys jagan on chandrababu, YS Jagan on Chandrababu Return gift, andhra pradesh assembly elections 2019, Gopalakrishna Dwivedi, YSRCP, TDP, Jana Sena, BJP, AP politics, Andhra Pradesh elections in 2019, Lok Sabha elections, Ist phase of lok sabha elections, national politics

The Andhra Pradesh leader of Opposition, YSRCP President Jagan Mohan reddy intresting comments on telangana CM KCR Return Gift statements, says that is the matter in between Chandrababu naidu and KCR. He has nothing to do with those statements.

చంద్రబాబుకు రిట్నార్ గిప్ట్ పై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Posted: 04/12/2019 12:16 PM IST
Ys jagan intresting comments on return gift to chandrababu naidu

సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిసిన తరుణంలో ఫలితాలు వెలువడటానికి, ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా వుందని తేలేందుకు మరో మండలం రోజుల పాటు నిరీక్షించాల్సిన వస్తుది. అయితే ఓటింగ్ జరిగిన తీరు, ప్రజల నాడి బట్టి ఎవరికి వారు విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత డిసెంబర్ 11న సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కచ్చితంగా ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తామని అన్నారు.

కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియంది కాదు. అయితే ఎన్నికలు ముగిసన క్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి సైతం వస్తామని కేసీఆర్ చెప్పడం.. అదే క్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా విజయవాడకు వచ్చి యాదవ సంఘాల సభ్యులతో మాట్టాడటం అంతా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రచారానికి రాని కేసీఆర్.. జగన్ తో చేయి కలిపి తెరవెనుక నుంచి డ్రామాలు అడించారన్న వార్తలు కూడా ఇప్పుడు ప్రచారలో నిలిచాయి.

ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిస్తూ.. రిటర్న్ గిప్ట్ ఎలా వుండబోతుందో మే 23న తెలుస్తోందని చెప్పారు. దీంతో అంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసన తరుణంలో వైసీపీ అధినేత జగన్ ను పత్రికా సమావేశంలో ఈ విషయమై ఓ విలేకరి ప్రశ్నించారు. ‘రిటర్న్ గిఫ్ట్ రెడీగా ఉందా?’ అని జగన్ ని ప్రశ్నించగా, ‘రిటర్న్ గిఫ్ట్ ఏంటమ్మ? నాకు అర్థం కాలేదు’ అని అన్నారు. ఈలోగా, తోటి విలేకరులు కల్పించుకుని ‘బాబుకు కేసీఆర్ ఇస్తానన్నారుగా’ అని అనడంతో, జగన్ స్పందిస్తూ, ‘బాబుకు, కేసీఆర్ కు మధ్య ఉంటే, వాళ్లను అడగాలి గానీ, నన్ను అడుగుతారేంటి?’ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  chandrababu  KCR  TDP  TRS  Andhra Pradesh assembly Elections  andhra pradesh  politics  

Other Articles