ఎన్నికల సంఘం ఎవరికీ అనుకూలంగా ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని.. తమపై ఎవరి ఒత్తిడీ లేదని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ రాజకీయ నేతగా సీఎం చంద్రబాబు అంటే గౌరవం ఉందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని ద్వివేది తెలిపారు. ఎన్నికల సంఘం ఏ ఒక్కరు చెప్పినట్లు నడుచుకోదని ఆయన చెప్పారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ స్థానాలకు కూడా సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు తెలిపారు. రేపు (గురువారం) ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈవీఎంలు, వీవీప్యాట్ లను ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో అధికారులు సిబ్బందికి అందజేశామని తెలిపారు. వాటిని తీసుకున్న పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లకు ప్రత్యేక వాహనాల్లో బయల్దేరి వెళ్లారని చెప్పారు.
రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకంగా ఉండే పోలింగ్ కేంద్రాల వద్ద మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ను నిర్ణీత సమాయానికి ఒక గంట ముందుగానే ముగిస్తున్నామని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
రాష్ట్రంలో 46 వేల 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2,118 మంది.. 25 లోక్సభ నియోజకవర్గాలకు 319 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. మొత్తం 3 కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, ఈ సారి సుమారు 10 లక్షల మంది యువత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
అంతేకాకుండా 5 లక్షల 27 వేల మంది వరకూ దివ్యాంగులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరి కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. 56,908 మంది సర్వీసు ఓటర్లు, 5,323 మంది ప్రవాసాంధ్రులు కూడా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లోనే వీవీ ప్యాట్లను వినియోగిస్తున్న ఈసీ.. తొలిసారి బ్యాలెట్ యూనిట్లపై అభ్యర్థుల ఫోటోలను కూడా ముద్రించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more