ఎన్నికలలో పాల్గొంటున్న అభ్యర్థుల నేరచరిత్ర విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంతో పాటుగా కేంద్ర ప్రభుత్వంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన అదేశాలను పాటించకుండా కోర్టు ధీక్కారానికి పాల్పడుతున్నారని మండిపడిన అత్యున్నత న్యాయస్థానం నోటీసులను జారీ చేసి.. వాటిపై బదులివ్వాలని అదేశించింది. దేశంలోని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రను ఎందుకు దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నిలదీసింది.
నేరచరిత్ర వున్న అభ్యర్థులు అటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచినా.. లేక ఇటు లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచినా.. ఆయా వివరాలను పత్రికలు, టీవీల్లో విస్తృతంగా ప్రచురించేలా చేయాలని గతేడాది ఐదుగురు సభ్యులు గల సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఎన్నికల కమీషన్ అమలు చేయకపోవడాన్ని ఆక్షేపించింది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. ఇప్పటివరకూ ఈసీ తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఎన్నికలలో పోటీ చేస్తున్న నేరచరిత్ర గల అభ్యర్థుల వివరాలపై అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది అత్యున్నత న్యాయస్థానాన్ని అశ్రయించి.. దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్, జస్టిస్ వినీత్ సారన్ లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య న్యాయస్థాన ధర్మాసనం.. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు ఎన్నికల కమీషన్ కు నోటీసులు జారీ చేసింది. కాగా, తమపై ఉన్న కేసుల వివరాలను అభ్యర్థులు తెలుపలేదని ఈసీ వాదనలు ఈసీ వినిపించింది. అభ్యర్థులు ఎవరూ తమ నేరచరిత్రపై మీడియాలో ప్రచురించలేదని వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో తమ ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే ఈసీ ఈ విషయమై సానుకూలంగా స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ధిక్కరణ నోటీసులు జారీచేసింది. రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారిపై నమోదైన కేసుల వివరాలను పత్రికలు, టీవీలు, వెబ్ సైట్లలో ప్రచురించడంపై వారం రోజుల్లోగా జవాబు ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. ఆతర్వాత తాము తీసుకునే చర్యలకు సైతం సిద్ధంగా ఉండాలని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more