Sitting BJP MP joins Congress కాంగ్రెస్ లో చేరిన యూపీ బీజేపి ఎంపీ

Sitting bjp mp from etawah ashok kumar dohre joins congress

Sitting BJP MP joins Congress, Ashok Kumar Dohrey, Etawah, Uttar Pradesh, Maheshwar reddy, NRI, Kadapa, Andhra Pradesh, politics, politics

Sitting Bharatiya Janata Party (BJP) MP from Uttar Pradesh’s (UP)s Etawah, Ashok Kumar Dohre joined Congress. He joined the party in presence of Congress President Rahul Gandhi.

బీజేపికి షాక్.. కాంగ్రెస్ లో చేరిన యూపీ బీజేపి ఎంపీ

Posted: 03/29/2019 03:25 PM IST
Sitting bjp mp from etawah ashok kumar dohre joins congress

దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అధికార బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. ఎన్నికల వేళ ఆ పార్టీ ఎంపీ ఒకరు ఝలక్ ఇచ్చారు. రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. బీహార్ లోని పట్నాసాహిబ్‌ ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్నసిన్హా ఏప్రిల్‌ 6న కాంగ్రెస్ లో చేరనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ అశోక్ కుమార్‌ దోహ్రే  బీజేపీకి గుడ్‌బై చెప్పడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ రోజు ఆయన ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరగా, ఆయనకు కండువా వేసి రాహుల్‌ ఆహ్వానించారు.

ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కడప జిల్లా రామాపురం మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎన్ఆర్ఐ మహేశ్వరరెడ్డి విషయంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఒక్కసారిగా పార్టీకి షాకిచ్చారు. గురువారం మధ్యాహ్నం తన నామినేషన్ ఉపసంహరించుకున్న మహేశ్వరరెడ్డి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండడంతో ఏం జరిగిందో తెలియక బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashok Kumar Dohrey  Etawah  Uttar Pradesh  Maheshwar reddy  NRI  Andhra Pradesh  politics  

Other Articles