ప్రజల అమయాకత్వాన్ని బలంగా మార్చుకుని వారిని నుంచి డబ్బులు లాగుతూ తమ పబ్బం గడుపుకునే మాయాల ఫకీరులు, మాటలు నేర్చిన తాంత్రికులు తగ్గుతున్న ఈ కాలంలో.. కొత్తగా ఈ మధ్యప్రత్యేకతలు లేని వారు కూడా బాబాలుగా అవతారమెత్తి ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. ఇలాంటి అనేక ఘటనలు ఇప్పటికే మనం చూశాం. ప్రజల జీవనగమనంలో పెనవేసుకున్న మూడనమ్మకాలను, బలహీనతలు, వారి అవసరాలను అడ్డుపెట్టుకుని అనతికాలంలో అపర కుభేరులుగా మరుతున్నారు.
అర్థంపర్థంలేని చేష్టలతో ప్రజలను వంచిస్తూ బాబాలుగా చలామణీ అవుతుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా పుల్లాయగూడెంకు చెందిన కొప్పుల రాంరెడ్డి అనే వ్యక్తి కూడా ఇలాంటివాడే. ఆరో తరగతి వరకు చదివిన రాంరెడ్డి లోకాన్ని అంతకంటే ఎక్కువే చదివాడు. ప్రజల మూర్ఖత్వాన్ని పెట్టుబడిగా చేసుకుని బాబా అవతారం ఎత్తాడు. అయితే, మిగతా బాబాలతో పోలిక లేకుండా కొరకడం అనే విద్యను తన ప్రత్యేకతగా మలుచుకున్నాడు.
ఆడామగా తేడా లేకుండా తన వద్దకు వచ్చిన వాళ్లను ఇష్టంవచ్చినట్టు కొరుకుతుంటాడు. తాను కొరికితే సంతానం లేనివాళ్లు సంతానం పొందుతారని, మగవాళ్లకు జబ్బులు నయమవుతాయని జనాల్లో ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టాడు. మగవాళ్లను కిందపడేసి తొక్కడం, ఆడవాళ్లను ఎక్కడ పడితే అక్కడ కొరకడం వంటి చేష్టలతో జుగుప్సాకరంగా వ్యవహరిస్తుంటాడు.
అయితే రాంరెడ్డి వికృత చర్యలను కొందరు వీడియో తీయడంతో అతడి చేష్టలు వెలుగులోకి వచ్చాయి. దాంతో, పోలీసులు స్పందించి అతడిని అరెస్ట్ చేసి తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఆడామగా అనే తేడాలేకుండా గ్రామసింహంలాగా తన పంటిగాట్లు రుచిచూపించే ఈ కొరుకుడు బాబా రూ.100 నుంచి రూ.200 వరకు ఫీజు వసూలు చేస్తాడు. ప్రత్యేక వైద్యం పేరుతో మరికొంత బాదుతాడట!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more