యశ్వంత్ పూర్-టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలులోని ఓ బోగీలో మంటలు చెలరేగగా.. వాటిని గుర్తించిన ప్రయాణికులు చైన్ లాగటం.. రైలు డ్రైవర్ కూడా అప్రమత్తతతో వ్యవహరించిన కారణంగా కేవలం ఒక్క బోగి మాత్రమే పూర్తిగా దగ్ధమైంది. అయితే మిగతా బోగీలకు మంటలు వ్యాపించకుండా రైల్వే అధికారులు కూడా సకాలంలో స్పందించి బోగీలను వేరు చేయడంతో ప్రాణనష్టం సంభవించకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ వద్ద చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో రైల్లోని ప్యాంట్రీకారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రైలులో మొత్తం 23 బోగీలు ఉండగా 9వ బోగీ అయిన పాంట్రీకార్ మంటలు చెలరేగాయి. వీటిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలు ఆపేశారు. ఆపై రైల్వే సిబ్బంది కూడా బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న ఈ సమయంలో మంటలు చెలరేగడంతో వారంతా విషయం తెలిసి భయాందోళనకు లోనయ్యారు. ప్యాంట్రీ కార్(వంట చేసే) బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణకు అదేశించామని చెప్పారు. ప్రయాణికులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంతో రైలుని గొల్లప్రోలు స్టేషన్లో నిలిపివేశారు. 5 గంటలుగా రైలు అక్కడే నిలిచిపోయింది.
అయితే ప్రమాదఘటనకు చేరుకుంటున్న రైల్వే అధికారులు ప్రమాదం గురించే పట్టించుకుంటున్నారు తప్పితే.. రైలు ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు పడే అవస్థలను, పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఘటనాస్థలంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంటిపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. కనీసం తాగడానికి మంచీ నీళ్లు కూడా లేవని వాపోతున్నారు. రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ గురించి పట్టించుకోవడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు. తక్షణమే రైల్వే శాఖ అధికారులు స్పందించాలని రైలుని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రంగంలోకి దిగిన స్థానికులు, సేవా సంస్థలు ప్రయాణికులకు తాగునీరు, అల్పాహారం వంటివి అందజేస్తున్నారు. స్థానికుల చొరవతో కొంతమంది చంటిపిల్లలకు పాలు లాంటి సదుపాయం కలిగింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more