అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా కేటీఆర్ ప్రతిపక్ష నేతలతో జరిపిన దౌత్యం ఫలించడంతో పద్మారావు ఎన్నిక ఏకగీవ్రం అయ్యింది. ఇవాళ సభ ప్రారంభమైన తరువాత ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనావాస్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపింది. ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్పార్టీ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ తుది నిర్ణయం శనివారం ఉదయం వెల్లడిస్తామని ప్రకటించింది. సోమవారం ఎన్నిక జరగడంతో డిప్యూటీ స్పీకర్గా పద్మారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉపసభాపతి పద్మారావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సభలో ఆయన మాట్లాడుతూ, గత 20 ఏళ్ల నుంచి పద్మారావుతో తనకు మరిచిపోలేని అనుబంధం ఉందని చెప్పారు. 2001లో కార్పొరేటర్ పదవిని వదులుకుని టీఆర్ఎస్ లో పద్మారావు చేరారని... జంటనగరాల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నేత అని కితాబిచ్చారు. జంటనగరాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. పదవిలో ఉన్నా, లేకపోయినా ఆయన ఒకేలా ఉంటారని అన్నారు. భవిష్యత్తులో పద్మారావు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యేలు, మంత్రులు అభినందనలు తెలిపారు. సభలో సభ్యులంతా పద్మారావు చేసిన సేవల్ని కొనియాడారు. కార్పొరేటర్ గా పద్మారావు ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆయన గతంలో కాంగ్రెస్ యువజన నాయకులుగా కూడా పనిచేశారని గుర్తు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా పద్మారవుపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పద్మారావు చురుకుగా పాల్గొన్నారన్నారు. పార్టీ నేతలు, ప్రజలంతా పద్మారావును పజ్జిన్న అని అప్యాయంగా పిలుచుకుంటారని హరీష్ తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన పద్మారావుకు శుభాకాంక్షలు తెలిపారు. .
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more