నెగెటివ్ రాజకీయాలు చేసే వ్యక్తుల కంటే పాజిటివ్ రాజకీయాలు చేసే వ్యక్తులకు విలువ ఉంటుందని మాజీ ఎంపీ సబ్బంహరి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలకు మాత్రమే పనికొస్తారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రజలందరికీ తెలిసే మాదిరిగానే ప్రయత్నించారని.. అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారని పేర్కొన్నారు. చంద్రబాబువి పాజిటివ్ పాలిటిక్స్ అని పేర్కొన్న సబ్బంహరి.. మోదీని చంద్రబాబు టార్గెట్ చేయడం వల్లే ఇక్కడి రాజకీయాల్లో మార్పు వచ్చిందని అన్నారు.
గత ఎన్నికల్లో బీజేపీకి 270కి పైగా స్థానాలు వచ్చాయని, ఈసారి 150-160 స్థానాలకు పడిపోతుందని జోస్యం చెప్పారు. ఇక, ఏపీలో బీజేపీ అసలు ఖాతా కూడా తెరవదని అన్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం అంటూ ఏర్పడితే చంద్రబాబు కీలకం అవుతారని సబ్బంహరి పేర్కొన్నారు. ఇక తన రాజకీయ భవితవ్యంపై కూడా కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన తనకు పచ్చ కండువా కప్పుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని అన్నారు. లేనిపక్షంలో రాజకీయాల నుంచి తప్పుకోవడమే సముచితమన్నారు.
ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని పేర్కోన్న సబ్బంహరి.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే రాజధాని నిర్మాణ పనులతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పనులు కుంటుపడిపోతాయన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీకే అనుకూల వాతావరణం ఉందన్న హరి.. రాజధానిలో ఒక్క పని కూడా ప్రారంభం కాలేదని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.
రాజధాని నిర్మాణానికి గతంలో భూములు ఇవ్వబోమన్న ఉద్దండరాయపాలెం రైతులు ఇప్పుడు అభివృద్ది శరవేగంగా సాగుతున్న క్రమంలో వందశాతం భూములు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబుపై రాష్ట్ర ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని, పెద్దవాడు, గౌరవంగా మాట్లాడతాడన్న భావన కొన్ని వర్గాల్లో ఉందని హరి అన్నారు. ఆయన మాత్రమే ఈ మాత్రమైనా అభివృద్ధి చేయగలిగాడని మరికొందరు అనుకుంటున్నారని పేర్కొన్నారు. వడ్డించే విస్తరిలాంటి పరిస్థితిని చిందరవందర చేసుకోకూడదని మరో వర్గం ప్రజలు భావిస్తున్నారని హరి వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more