సీబీఐ తీరుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న దీక్షకు విపక్షాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పడికే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కెజ్రీవాల్, టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు తమ మద్దతును ప్రకటించగా, తాజాగా శివసేన కూడా మమత బెనర్జీకి మద్దతు ప్రకటించింది. సీబిఐని కేంద్రంలోని బీజేపి పార్టీ వారికి అనుకూలంగా లేని రాష్ట్రాలపై ప్రయోగిస్తుందని అరోపించింది.
శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రావత్ మమతా బెనర్జీ ప్రభుత్వానికి తన మద్దతును ప్రకటించారు. ‘‘సీబీఐని దుర్వినియోగం చేయడం దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయం. ఏదైనా అక్రమం జరిగిందని భావిస్తే ముందుగా తెలియజేయాలి. ఎమర్జెన్నీ సమయంలో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లిందని భావించిన ప్రజలు ఇందిరాగాంధీని ఓడించారు. ఈ సంఘటన తర్వాత ఏం చేయాలో ప్రజలకు తెలుసు’’ అని సంజయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఆ తరువాత మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే స్పందిస్తూ.. ‘‘మమతా చేస్తున్న పోరాటాన్ని మేం అభినందిస్తున్నాం. కేంద్రప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నారు. ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుంది. ఈ విషయంలో ఆమె వెనకాల నడవడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు. సీబిఐలో తమ మాట వినని అధికారులను తప్పించి.. తమ చెక్కుచేతల్లోని అధికారులను నియమించి.. కేంద్రం పలు నాటకాలకు తెరతీస్తుందని ఆయన విమర్శించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం తన సంఘీభావం ప్రకటించారు. ‘‘బెంగాల్ ఘటన రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తిపై దాడి చేయడమే. మేం మమతా బెనర్జీకి మద్దతుగా నిలుస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్రం సీబీఐని దుర్వినియోగపరుస్తోంది. ఈ విషయంలో ఎస్పీతో పాటు దేశం మొత్తం ఇదే చెబుతోంది. కొంతకాలం క్రితం సీబీఐ డైరెక్టరు వివాదంతో ఆందోళనకు గురైన కేంద్రం ఇప్పుడు సీబీఐని అడ్డం పెట్టుకుని విపక్షాలను బెదిరించాలని చూస్తోంది’’ అంటూ ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ..‘‘భాజపా అధికారంలోకి వచ్చిననాటి నుంచి విపక్షాలను సాగనంపడంపైనే దృష్టి సారించింది. దేశ ప్రయోజనాల కంటే దీనిపైనే వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ..‘‘దీదీ చేస్తున్న పోరాటం సమంజసమే. దేశం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ప్రజల నిర్ణయమే అంతిమం. కేంద్రానిది కాదు’’ అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more