సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీ రాజకీయ వారసుడిగా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే తన సత్తా చాటిన రాహుల్ గాంధీ.. తాజాగా మరిన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆయన.. పేదలను ఆకర్షించేందుకు సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే.. దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయాన్ని అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఛత్తీస్ గఢ్ లోని రాయ్పూర్ లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం.. ఆహార భద్రతా చట్టం లాంటి వాటితో ఇప్పటికే దేశంలోని పేదలకు కనీసం రోజుకో పూటతో అన్నం మాత్రం లభిస్తుంది. రూపాయికే బియ్యం, ఏడాదికి కనీసం వంద రోజుల పని కల్పనతో పేదలు అకలి బాధలకు కొంత దూరమయ్యారనే చెప్పవచ్చు. అయితే ఇలాంటి పథకాన్ని మరోమారు టార్గెట్ గా చేసుకున్న రాహుల్ తాజాగా తాము అధికారంలోకి వస్తే మరో సంచలన పథకాన్ని అమల్లోకి తీసుకోస్తామని తెలిపారు.
కాంగ్రెస్ గతంలో అనేక చారిత్రక నిర్ణయాలను తీసుకుందన్న రాహుల్.. 2019లో అధికారంలోకి వస్తే.. మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ పథకమే పేదలకు కనీస అదాయ భరోసా పథకం. ఈ పథకంతో దేశంలో పేదలందరూ కనీస ఆదాయం పొందనున్నారని చెప్పారు. ఆకలి, పేదరికం లేని నవభారత నిర్మాణమే తమ లక్ష్యమని రాహుల్ ప్రకటించారు. ఈ పథకం ప్రకారం నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో అమల్లోని పథకం భారత్ తో తాము అధికారంలోకి వస్తే అమల్లోకి వస్తుందని రాహుల్ ప్రకటించారు. కోట్లాది మంది ఆకలి, పేదరికంతో అలమటిస్తుంటే నవభారతాన్ని నిర్మించలేమని రాహుల్ తెలిపారు. పేదరిక నిర్మూలనకు ఈ పథకం దోహదం చేస్తుందని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
We cannot build a new India while millions of our brothers & sisters suffer the scourge of poverty.
— Rahul Gandhi (@RahulGandhi) January 28, 2019
If voted to power in 2019, the Congress is committed to a Minimum Income Guarantee for every poor person, to help eradicate poverty & hunger.
This is our vision & our promise.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more