దేశంలోని వాహనాలు వాడే ఇంధన ధర కన్నా విమానాలు వాడే ఇంధన ధరలు చౌకగా నమోదు కావడం దేశ ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికే మోడీ సర్కార్ సంపన్నుల పక్షాన నిలుస్తుందని.. సామాన్యులకు నామమాత్రపు లబ్దిని మాత్రమే చేకేర్చుతుందన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో తాజాగా పెట్రోల్ ధరల అంశం కూడా అందుకు ఊతమిస్తున్నాయి. విమానాలు వాడే వైట్ పెట్రోల్ ధర సామాన్యులు వాడే పెట్రోల్ ధర కన్నా అధికంగా వుండటం పరిపాటి. అయితే మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా వుండటమే చర్చనీయాంశంగా మారింది.
అంతర్జాతీయమార్కెట్లో నెలకొన్న పరిణామాలతో క్రూడాయిల్ ధర గణనీయంగా తగ్గగా, తదనుగూణంగా తగ్గాల్సిన ఇంధన ధరలు దేశంలోని వాహనదారులకు అందుబాటులోకి రాకపోవడంతో వారు ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలపై మండిపడుతున్నారు. ఇదే క్రమంలో కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ సంపన్నులు మాత్రమే తిరిగే విమానాలకు, విమానయాన సంస్థలకు లబ్ది చేకూర్చుతూ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ ధరలను మాత్రం అమాతం తగ్గించింది. గత నెల 1న సుమారుగా పదిశాతం మేర తగ్గిన ఏటీఎఫ్ ధర తాజాగా మరోమారు భారీగా తగ్గించింది కేంద్రం.
ప్రస్తుతం ఏటీఎఫ్ కిలో లీటర్ల ధర రూ. 58,060లకు చేరడంతో ఇది దేశంలోని వాహనదారులకు అందే పెట్రోల్ ధర కన్నా తక్కువగా వుంది. ఇక ముంబై సహా పలు ప్రాంతాల్లో లభించే బహిరంగ మార్కెట్లో లభించే కిరోసిన్ ధర కన్నా అధికంగా వుందని పలువురు పెదవి విరుస్తున్నారు. విమాన సంస్థలకు లాభాలను అందించేందుకు మోడీ సర్కార్ ఏకంగా 58 రూపాయలకు లీటరు ఏటీఎఫ్ ను అందిస్తుంది. అయితే నిత్యవాసరాల సరుకులను రవాణా చేసే అన్ని వాహనాలు డీజిల్ నే వాడుతున్నా దాని ధర కూడా ఏటీఎఫ్ కన్నా అధికంగా వుంది.
పెట్రోలు, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగూణంగా తగ్గిస్తామని చెప్పిన ఇంధన సంస్థలు సామాన్యుల జేబులు కొట్టి సంపన్నులు తిరిగే విమానాలకు, విమానయాన రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు లబ్దిని చేకూర్చుతున్నారన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి. సామాన్యులు ఎన్నో వ్యవప్రయాసలకోర్చి తమ బతుకుబండి నడిపించేందుకు తప్పనిసరై వాహనాలలో ఇంధనాన్ని వినియోగించుకుంటున్నా.. పారిశ్రామిక వేత్తలుగా అవతారంలో విమాన సంస్థలు లాభాలను పిండుకుంటున్నాయన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.
ప్రస్తుతం విమాన ఇంధన ధర లీటరుకు రూ. 58.07కు చేరడంతో విమానయాన సంస్థలు లాభాలబాటలో నడుస్తుండగా, ఇటు వాహనదారులు మాత్రం పెట్రోల్ ధరల పెంపుపై రుసరుసలాడుతున్నారు. వాహనదారులు వాడే ఇంధన ధరలు అకాశానంటుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 73కు అటూఇటుగా ఉంది. అంటే, విమాన ఇంధనంతో పోలిస్తే, పెట్రోలు ధర లీటరుకు రూ. 15 అధికంగా ఉన్నట్టు. డీజిల్ ధర రూ. 68గా ఉండగా, అది కూడా విమాన ఇంధన ధరతో పోలిస్తే రూ. 10 అధికంగా ఉన్నట్టు.అక్టోబర్ 18 నుంచి తగ్గుముఖం పట్టిన ధరలు.. ఇప్పటివరకూ లీటరు పెట్రోలుపై రూ. 14.18, డీజిల్ పై రూ. 13.03 మేరకు మాత్రమే తగ్గాయి. అయితే ఏటీఎప్ అందించే ఇంధన మాత్రం డిసెంబర్ ఒకటిన రూ.8.4 మేర, తాజాగా 9.90 మేర తగ్గి ఏకంగా నెల రోజుల వ్యవధిలో 18.3 మేర తగ్గించడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more