పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమల అయప్పస్వామి దేవాలంయంలోకి రుతుస్రవం కలిగే వయస్సు గల మహిళలు బింధు, కనకదుర్గలు ప్రవేశించి.. స్వామివారి దర్శనాన్ని చేసుకోవడం పట్ల భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తీ దేశాయ్ స్పందించారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా నారీ శక్తి ఏంటన్న విషయం మరోసారి ప్రపంచానికి తెలిసి వచ్చిందని అమె వ్యాఖ్యానించారు. నెలన్నర క్రితం తాను చేయలేకపోయిన పనిని ఇద్దరు మహిళలు చేసి చూపించారని అమె వ్యాఖ్యానించారు.
దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని సూచించారు. ఇద్దరు మహిళలను స్వామి సన్నిధికి పంపిన కేరళ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె, అతి త్వరలో తాను కూడా ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటానని అన్నారు. మహిళల ప్రవేశంతో అనాదిగా వస్తున్న చాందస సంస్కృతి తుడిచిపెట్టుకుపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. వారి ప్రవేశం తరువాత గర్భగుడి తలుపులు మూసివేయడం, శుద్ధి చేయాలని నిర్ణయించడాన్ని ప్రశ్నించిన తృప్తీ దేశాయ్, ఇది యావత్ భారత మహిళలకే అవమానమని మండిపడ్డారు.
ఇదిలావుండగా, ఇవాళ వేకువజామున సుమారు మూడున్నర గంటలకు బింధు, కనకదుర్గలు శబరిగిరీశుడిని దర్శనం చేసుకున్న నేపథ్యంలో అసలు వీరు ఎవరు అన్న విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాల సంప్రదాయాన్ని, భక్తుల మనోభావాలను తోసిరాజుతూ ఆలయంలోకి వెళ్లిన వీరిద్దరూ గతంలో దర్శనానికి వచ్చి.. భక్తుల అందోళనకు జంకి వెనక్కుతిరిగి వెళ్లిన మహిళలే. నవంబర్ 24న ఆలయానికి వచ్చి, స్వామిని దర్శించకుండా వెనక్కు తిరిగి వెళ్లిపోయిన 11 మంది మహిళల బృందంలో వీరూ ఉన్నారు.
మకరవిళక్కు సందర్భంగా డిసెంబర్ 30న ఆలయాన్ని తెరవగా, ఆపై రెండు రోజుల తరువాత భక్తుల సంఖ్య బాగా పలచబడటంతో వీరిద్దరూ వేకువ జామున పోలీసుల రక్షణ వలయంలో ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు. వారి కోరిక నెరవేరింది. కాగా బిందు వయసు 44 సంవత్సరాలు. సీపీఐ (ఎంఎల్) కార్యకర్తగా వ్యవహరిస్తూనే, ఓ కాలేజీలో లెక్చరర్ గా ఆమె పనిచేస్తున్నారు. కనకదుర్గ వయసు 42 సంవత్సరాలు కాగా, కేరళ ప్రభుత్వ పౌర సరఫరాల విభాగంలో ఈమె పనిచేస్తున్నారని పిటీఐ వివరాలను వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more