దేశ రాజధానిలో మరో నిర్భయ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో ఫార్మ విద్యార్థినిపై జరిగిన ఘటనలో ఫాస్ట్ ట్రాకు కోర్టులు నిందితులకు శిక్ష ఖారురు చేసిన మానవమృగాలకు మాత్రం భయం, వణుకు కలగడం లేదు. ఏడేళ్ల క్రితం జరిగిన దారుణ ఘటనను యావత్ దేశం ఇంకా మరువక ముందే అలాంటి దారుణానికే ఒడిగట్టారు దేశరాజధానిలోని పైశాచిక మృగాలు. కదులుతున్న ఆటోలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కామాంధుల అఘాయిత్యం నేపథ్యంలో సృహ కోల్పోయిన బాధితురాలిని ఓ దాబా పక్కనే పడేసి పరారయ్యారు. ఆరుగురు నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కదులుతున్న అటోలో అమెపై దారుణానికి ఒడిగట్టిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
యావత్ దేశం నూతన సంవత్సర సంబరాలకు సిద్దమవుతున్న వేళ.. గత ఏడాది చివరి రోజున మధ్యాహ్నం ఈ ఘటన ఢిల్లీలోని గుర్గావ్ లో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల మహిళ.. ఇటీవలే మరణించిన అమె భర్త పనిచేస్తున్న సంస్థకు వెళ్లి.. భర్త మరణానంతరం అమెకు రావాల్సిన డబ్బులను సెటిల్ చేసుకునేందుకు ఆటోను ఆశ్రయించింది. బాధితురాలు నఖ్ రోలా చౌక్ లో మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో ఆటో ఎక్కింది.
ఆమెను ఐఎంటీ-మనేసర్ కు తీసుకెళ్లాల్సిన ఆటో డ్రైవర్ అంకిత్ దారి మళ్లించి బాధితురాలిని మరో ఆటో డ్రైవర్ దీపక్ రూముకు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే వున్న మరో ఇద్దరూ అటోడ్రైవర్లతో కలిసి అమెపై వంతుల వారీగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 9 గంటలకు ఆమెను ఆటోలో తీసుకెళ్లిన నిందితులు బాధితురాలిని మరో ముగ్గురికి అప్పగించారు. వారందరూ కలిసి అదే ప్రాంతంలో ఆటోను తిప్పుతూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
పైశాచిక మృగాళ్ల దాడిలో నరకం అనుభించిన బాధితురాలు బాధను భరించలేక స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను రాంపురా ఫ్లై ఓవర్ సమీపంలో ఉన్న ఓ దాబా వద్ద పడేసి వెళ్లిపోయారు. స్పృహ కోల్పోయి పడి ఉన్న బాధితురాలిని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అటోలో బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more