తెలంగాణలో డిసెంబర్ నెల 7వ తేదీన జరగనున్న ఎన్నికలలో ప్రజాతీర్పు ఎలా వుండబోతుంది.. ఎవరు గెలుస్తారన్న విషయాలు ఈనెల 11న వెల్లడి కానున్నా అసలు ఒరవడి ఎలా వుంది అన్న అంచనాలు తెలుసుకునేందుకు ప్రీ ఫోల్ సర్వేలవైపు ప్రజలు అసక్తిని కనబరుస్తారు. ఇక ఏ పార్టీకి చెందిన తటస్థ ఓటర్లు రాష్ట్రంలో గెలుపోటములను నిర్ధేశించే స్థాయిలో వున్నారు. వారు కూడా ఈ అంచనాలను చూసే ఆయా అభ్యర్థులు, పార్టీల వైపు మొగ్గుచూపుతారు.
ఇక ఇలాంటి సర్వేలను ఖచ్చితత్వంతో స్పష్టం చేసే రాజకీయ నేతలలో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా సిద్దహస్తుడు. ఆయన గతంలో వెలువరించిన గణంకాలు రమారమి వాస్తవ రూపం దాల్చడంతో ఆయన అంచనాలకు అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లో కూడా మంచి అదరణ వుంది. అయితే ఇటీవల ఆయన తెలంగాణ ఎన్నికలలో ఇండిపెండెంట్లు సత్తా చాటుతారని కూడా ప్రకటించారు.
తెలంగాణ ఎన్నికలలో స్వతంత్రులుగా బరిలో నిలిచిన వారిలో దాదాపు పది మంది గెలుస్తారన్న ఆయన వారిలో నారాయణ పేట్ నుంచి శివకుమార్ రెడ్డి, బోధ్ నుంచి అనీల్ జాదవ్ లు విజయాన్ని అందుకుంటారని కూడా వెల్లడించారు. రోజుకు ఇద్దరు చోప్పున వారి పేర్లను కూడా ప్రకటిస్తానని చెప్పిన ఆయన ఈసీ అధికారుల సూచనల మేరకు మిన్నకుండిపోయారు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త ఇటు నెట్టింట్లో సంచలనంగా మారింది.
ఆయన గెలుపు గుర్రాల జాబితాలో మరో ఇద్దరు వున్నారని వారికి ఆయన ఫోన్ చేసి అభినందించారన్న వార్త కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వారిద్దరూ కాంగ్రెస్ తరుపున బరిలో నిలిచిన యువకులేనని కూడా సమాచారం. వారిలో మెదక్ జిల్లా పటాన్ చెరువు కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ జిల్లా చొప్పదొండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంల పేర్లు వున్నాయని తెలుస్తుంది. అదెలా అంటే వీరికి లగడపాటి రాజగోపాల్ స్వయంగా ఫోన్ చేశారని వారికి అభినందనలు కూడా తెలిపారని సమాచారం.
తన సర్వే వివరాలను వారికి తెలిపిన లగడపాటి రాజగోపాల్.. వారికి ఎన్ని ఓట్లు వస్తాయో కూడా చెప్పారని, సమాచారం. దీంతో, లగడపాటి సర్వేలో మూడో గెలుపు గుర్రం కాటా శ్రీనివాస్ గౌడ్ కాగా నాలుగో గెలుపు గుర్రం మేడిపల్లి సత్యమే అనే చర్చ జోరుగా సాగుంతోంది. దీంతో ఆయా అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరో రెండు రోజుల్లో ముగుస్తున్న ఎన్నికలలో ప్రచారాన్ని తారాస్థాయికి చే్ర్చుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more