అర్థరాత్రిళ్లు టీవీ చూస్తూ ఆలస్యంగా నిద్రకు ఉపక్రమిస్తున్నారా.? లేదా రాత్రిళ్లు నిద్ర ముంచుకోస్తున్నా స్మార్ట్ఫోన్ వాడటం మీకు అలవాటా? నిద్రకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఫేస్ బుక్, యూట్యూబ్ తో టైమ్ గడిపేస్తుంటారా? ఫోన్, ల్యాప్ టాప్ కాకుండా రాత్రంతా పుస్తకాలతో కుస్తీ పడుతుంటారా? లేక నిద్ర వస్తున్నా అర్థరాత్రిళ్లు స్నేహితులతో కలసి తిరిగే నిషాచరులా.? అయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. అర్థరాత్రిళ్లు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వకుండా మేల్కోని వారికి అనారోగ్య ముప్పు అధికంగా వుంది.
ఇలా చేసేవారికి హృద్రోగ సంబంధిత వ్యాధులతో పాటు చక్కెర వ్యాధి (షుగర్ వ్యాది) బారిన పడే ప్రమాధం అధికంగా వుంది. కూడా అధికంగా గుండెజబ్బుల్ని తీసుకొచ్చేవే. బోనస్గా డయాబెటిస్ కూడా వస్తుంది. వామ్మో అనుకోకండి. అర్థరాత్రి వరకు నిద్రపోని వారికి గుండెజబ్బులు, డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువ అని తాజా అధ్యయనాలు తేల్చాయి.
త్వరగా నిద్రపోయి తెల్లవారుజామున నిద్రలేచేవారితో పోలిస్తే... అర్థరాత్రి ఆలస్యంగా నిద్రపోయే వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ 2.5 రెట్లు ఎక్కువ అన్నది నెస్లే హెల్త్ సైన్స్ పరిశోధకుల అధ్యయనం సారాంశం. రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే నిద్రలేచేందుకు ఇబ్బందులు పడేవారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా ఎక్కువే. అంతేకాదు... వేళాపాళా లేకుండా తినడం, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, స్వీట్స్ ఎక్కువగా తీసుకునేవారికీ ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువ.
ఆలస్యంగా తినడం కూడా టైప్-2 డయాబెటిస్కు దారితీస్తుందట. కారణం... సిర్కాడియం రిథమ్ అదుపుతప్పడమే. అందుకే అర్థరాత్రి వరకు మేల్కొనేవాళ్లు నిద్రపోయేముందు తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అది మెటబాలిజంపై ప్రభావం చూపిస్తుంది. అర్థరాత్రి వరకు మేల్కొనేవాళ్లు... వీకెండ్లో ఎక్కువసేపు నిద్రపోయి ఆ లోటును భర్తీ చేయాలని ఆలోచిస్తారట. అది కూడా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more