భారత ఇవాళ ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సి43తో మరో మైలురాయిని సాధించింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇవాళ్టి ప్రయోగం విజయవంతమైంది. దీంతో విదేశాలకు చెందిన దాదాపు 269 ఉపగ్రహాలను భారత్ నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఘనత భారత్ సొంతమైంది. దీంతో విదేశాలకు చెందిన 250 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మైలురాయిని భారత్ ఇస్రో అధిగమించింది.
గురువారం ఉదయం సరిగ్గా 9.59 గంటలకు పీఎస్ఎల్వీ-సి43 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఒక స్వదేశీ ఉపగ్రహంతోపాటు అమెరికా, కెనడా, కొలంబియా, మలేషియా తదితర ఎనమిది దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా పంపారు. పీఎస్ఎల్వీ ద్వారా నాలుగు దశల్లో ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగానికి సంబంధించి బుధవారం ఉదయం 5.59 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ 28 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
పీఎస్ఎల్వీ రాకెట్ నిర్దేశించిన సమయానికి విజయవంతంగా మూడు దశలను దాటుకుంటూ కక్ష్యలోకి ప్రయాణించింది. పీఎస్ఎల్వీ-సి43 ద్వారా మన దేశానికి చెందిన హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దాదాపు 2 గంటల తర్వాత పీఎస్ఎల్వీ సీ43 స్వదేశీ హైపరసానిక్ ఉపగ్రహాన్ని సూర్య సమస్థితి కక్ష్యలోని 630 కిలోమీటర్ల ఎత్తున, మిగతా 30 విదేశీ ఉపగ్రహాలను 540 కిలోమీటర్ల ఎత్తున రెండు దశల్లో నిలుపుతుంది.
వాస్తవానికి హైపర్స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో తొలిసారిగా 2008 మేలో ప్రయోగించింది. సుమారు 83 కిలోల బరువైన ఈ ఉపగ్రహా ప్రయోగాన్ని చంద్రయాన్-1 తర్వాత నిర్వహించింది. ప్రస్తుతం మా రాకెట్లో అమెరికాకు చెందిన 23 ఉపగ్రహాలు, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్లాండ్, మలేషియా, నెదర్లాండ్స్, స్పెయిన్లకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహం ఉన్నాయి. విదేశీ ఉపగ్రహాల మొత్తం బరువు 261.5 కిలోల బరువు కాగా, వీటిలో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి.
వీటిని పీఎస్ఎల్వీసీ 43 రాకెట్ ద్వారా వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు రాకెట్లోని నాలుగో దశ ఇంజిన్ను రెండుసార్లు మండించారు. స్వదేశీ ఉపగ్రహం హైచ్వైఎస్ఐఎస్ బరువు 380 కిలోలు. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రధాన విభాగం అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ డిజైన్ చేయగా, చండీగఢ్లోని సెమికండక్టర్ ల్యాబ్లో తయారుచేశారు. నింగిలో 630 కిలోమీటర్ల దూరం నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను తీయగల ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ, తీర ప్రాంతాల అంచనా, ఇతర భౌగోళిక పరిసరాలకు సంబంధించి వివిధ రకాల సేవలను అందించనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more