తెలంగాణ పోలీసుల అత్యుత్సాహంపై హైకోర్టు ధర్మాసనం మండిపడింది. వ్యభిచార నిర్వాహకులపై పీడి యాక్టు పెట్టడాన్ని రాష్ట్రోన్నత న్యాయస్థాన ధర్మాసనం తోసిపుచ్చింది. వ్యభిచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించలేమని, అటువంటి కేసులపై పీడీ యాక్ట్ ప్రయోగం అర్థరహితమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేరాన్ని పోలీసులు శాంతిభద్రతల కోణంలోనే చూడాలని, అంతేకాని పీడి యాక్డు కింద చూడరాదని పేర్కొంది. దీంతో పోలీసులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
యాదాద్రిలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారిపై పీడి యాక్టు పెట్టడం ఏంటని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. బ్రోతల్ హౌజ్ నిర్వాహకులను పట్టుకుని వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడమేకాక, మహిళలను నిర్బంధించి జైలులో ఉంచడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. చట్టం అమలు చేసేటప్పుడు సహేతుకత పాటించాలని, చట్టం పేరుతో మహిళల జీవించే స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని కోర్టు హెచ్చరించింది. అలాగే పోలీసులకు ఏ నేరానికి ఎలాంటి చట్టాల కింద కేసులు నమోదు చేయాలో తెలుసుకోవాలని మండిపడ్డింది.
చిన్నపిల్లల్ని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని ఆరోపిస్తూ యాదాద్రికి చెందిన నలుగురు మహిళలపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ మహిళ తరపున బంధువులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం పోలీసుల తీరును తప్పుపట్టింది. అలజడులు, అశాంతికి కారణమయ్యే తీవ్రమైన నేరాలు జరిగిన సందర్భాల్లోనే నిందితులపై పీడి యాక్డు చట్టాన్ని ప్రయోగించాలని గుర్తు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more