కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక పూజలు చేసుకోవాలని భక్తులు ప్రత్యేక సేవా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నా అవి అక్రమార్కుల పాలై అడ్డదారిలో సంపన్న భక్తులకు మాత్రమే దక్కనునండడంతో ఇవాళ జారీ చేసిన ఫిబ్రవరి నెల ఆన్ లైన్ సేవా టికెట్ల నుంచి కీలక మార్పును అమలు చేయనున్నట్టు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ సేవ టికెట్ల విధానంలో కీలక మార్పులు అమలు చేయనున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
ఇప్పటి వరకు వున్న విధానంలో కొంత మార్పులు చేర్పులు చేశారు. ఒక ఈ-మెయిల్, ఒక ఫోన్ నంబర్ నుంచి ఒకే రిజిస్ట్రేషన్ విధానాన్ని నూతనంగా తీసుకు వచ్చామని, ఈ రిజిస్ట్రేషన్ కు ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న విధానంలో సేవా టికెట్లు అక్రమార్కుల పాలవుతున్నాయని, పలువురు ఒకే ఫోన్ నంబర్ పై వేర్వేరు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సింఘాల్ వెల్లడించారు. సేవా టికెట్లలో అక్రమాలకు పాల్పడిన భక్తులు, టీటీడీ సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టామని ఆయన తెలిపారు.
వచ్చే నెలలో రానున్న వైకుంఠ ఏకాదశికి నవంబర్ 25 నుంచి ఏర్పాట్లు ప్రారంభించనున్నామని భక్తులకు ఇబ్బంది లేకుండా మాడవీధుల్లోనే ఈ దఫా క్యూలైన్ల ఏర్పాటు ఉంటుందని చెప్పారు. మాఢ వీధుల్లో భారీ షెడ్లను ఏర్పాటు చేసి, ప్రశాంత వాతావరణం ఉండేలా చూస్తామని తెలిపారు. డిసెంబర్ 4 నుంచి 12 వరకూ తిరుచానూరులో పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. 12న పంచమీ తీర్థం వేడుక ఉంటుందని తెలిపారు.
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీనివాసుని ఆర్జిత సేవలకు సంబంధించిన మొత్తం 67,146 టికెట్లను టీటీడీ కొద్దిసేపటి క్రితం ఆన్ లైన్లో విడుదల చేసింది. వీటిల్లో 9,796 టికెట్లను ఆన్ లైన్ డిప్ విధానంలో భక్తులకు అందించనున్నట్టు అధికారులు వెల్లడించారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాదదర్శనం టికెట్లు కోరే భక్తులు, శుక్రవారం నుంచి సోమవారం వరకూ రిజిస్టర్ చేసుకోవచ్చని, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్ తీసి టికెట్లు పొందిన భక్తుల పేర్లను వెల్లడిస్తామని పేర్కొంది. ఆపై రెండు రోజుల్లోగా వారు నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.
7,096 సుప్రభాతం, 110 చొప్పున తోమాల, అర్చన టికెట్లు, 180 అష్టదళ పాదపద్మారాధన, 2,300 నిజపాద దర్శనం టికెట్లను డిప్ తీయనున్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో సాధారణ ఆన్ లైన్ బుకింగ్ విధానం ద్వారా 57,350 టికెట్లను విడుదల చేసినట్టు టీటీడీ పేర్కొంది. వీటిల్లో విశేష పూజకు 2,000, కల్యాణోత్సవం 12,825, ఊంజల్ సేవ 4,050, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,425, సహస్ర దీపాలంకార సేవ 16,200, వసంతోత్సవం 14,850 టికెట్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more