ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తొలగించే కార్యక్రమం యథేచ్ఛగా సాగుతోందని వైసీపీ అరోపించిన క్రమంలో ఇదే అంశంపై ఇటు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 60 లక్షల ఓట్లను ప్రభుత్వం తొలగించిందని అంబటి రాంబాబు అరోపించిన నేపథ్యంలో పవన్ కల్యాన్ కూడా ఇదే అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.
ఇప్పటి వరకు దేశంలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగులను చూశామన్ని ఆయన ఇప్పుడు మాత్రం ఓట్లను ఎత్తుకెల్లే గ్యాంగులను చూస్తున్నామని అన్నారు. అయితే దీనిపై టీడీపీ నేతలు ఎప్పుడు, ఎలా స్పందిస్తారో.. ఏం మాట్లాడుతారో అని తాను ఎదురుచూస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ లో పేర్కోన్నారు. ఇక అంతకుముందు ఆయన కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కన్నడిగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘కర్ణాటకలోని సోదర, సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
మరోవైపు పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ జనసేన సమన్వయ కమిటీలను నియమించడంతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. రేపు శుక్రవారం నుంచి ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకూ పవన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా కాకినాడలోని ఏడు నియోజకవర్గాల్లో పవన్ యాత్ర సాగనుంది. జనసేన కేడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా పవన్ యాత్ర చేపట్టనున్నారు.
పర్యటనలో భాగంగా ప్రజలతో పాటు పలువర్గాల ప్రతినిధులు, ప్రజా సంఘాలతో పవన్ ముఖాముఖి సమావేశం అవుతారు. రేపు ఉదయం విజయవాడలోని జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అన్నవరం, సామర్లకోట మీదుగా పవన్ తునికి చేరుకుంటారు. తొలిరోజు తునిలోని గొల్ల అప్పారావు సెంటర్ లో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు. నియోజకవర్గాల్లో పర్యటన సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకుంటారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more