తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చిన 2014 అసెంబ్లీ ఎన్నికలలో తాను ముషిరాబాద్ నుంచి బరిలో దిగుతానని చెప్పగా, ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని.. అందుకు అవసరం అయితే..తనకు పదికోట్లు రూపాయలను కూడా ఇస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయాలని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, నాయిని నర్సింహారెడ్డి అడిగిన స్థానం ఇవ్వకుండా, అక్కడి నుంచి మారడానికి తనకు కేసీఆర్ పది కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపారని స్వయంగా ఆయనే చెప్పారని అన్నారు.
ఎన్నికల అధికారులు నాయిని నరసింహారెడ్డి బహాటంగా, బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసీఆర్ పై తక్షణమే కేసు పెట్టి విచారణ చేపట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్, ఆయన బంధువు అయిన మైహోమ్ రామేశ్వరరావు నివాసాలపై ఐటీ దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గానికి కనీసం ఇరవై, ఇరవైఐదు కోట్లు ఖర్చు పెట్టేందుకు కేసీఆర్ సిద్ధపడ్డారని, ఐటీ, ఈడీ దాడులు మోదీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు.
నోట్ల రద్దు ఎఫిసోడ్ నుంచి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి దోస్తి కుదిరిందని విమర్శించారు. అప్పటి నుంచే టీఆర్ఎస్ బీజేపికి బాసిన ప్రభుత్వంగా మారిందని రేవంత్ అరోపించారు. కొడంగల్ వంటి నియోజకవర్గాల్లో వందకోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని, కోట్ల రూపాయలను ఈరోజు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిపైనా ఎన్నికల అధికారులు నిఘా పెట్టాలని, ఐటీ అధికారులు దాడులు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా నాయినికి కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, వెన్నంటి ఉన్న నాయినిని కేసీఆర్ అవమానించారని ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more