బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ తిత్లీ శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. గురువారం ఉదయం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు- పల్లిసారథి వద్ద తిత్లీ తుఫాన్ తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. గాలులు ఉద్దృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరిచెట్లు పెనుగాలులకు ఊగిపోతున్నాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఉద్దానంతో పాటు సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, పలాస, గార, వజ్రపుకొత్తూరు, సోంపేటలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
తుపాను తీవ్రతకు ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, నందిగాం, పలాస, వజ్రపు కొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇది మరింత బలపడి పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గురువారం సాయంత్రం వరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ కేంద్రం తెలిపింది. దీంతో ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ అయింది.
గాలుల బీభత్సానికి భారీ వృక్షాలు విరిగిపడుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ప్రమాదాన్ని ఊహించి ముందుగానే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గాలి బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా బారువ వద్ద పార్కింగ్ చేసిన లారీలు పడిపోయాయి. రోడ్డుపై ఏమీ కనిపించకపోవడంతో 16వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాలన్నీ నిలిచిపోయాయి. కాగా, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా తీరప్రాంత ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. దీనివల్ల ప్రాణనష్టాన్ని అడ్డుకోగలిగింది. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీ స్థాయిలోనే ఉందని అధికారులు అంటున్నారు.
#WATCH: Latest visuals from Andhra Pradesh's Srikakulam after #TitleCyclone made a landfall. pic.twitter.com/itSoHD16wk
— ANI (@ANI) October 11, 2018
శ్రీకాకుళంలో తుఫాన్ పరిస్థిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటి కప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన శ్రీకాకుళం బయలు దేరుతున్నారు. అక్కడ సహాయ, పునరావాస చర్యలను చంద్రబాబు పరిశీలించనున్నారు. రాత్రి శ్రీకాకుళం జిల్లాలోనే సీఎం మరోవైపు విజయనగరంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య ఎదురైతే 08922 236947, టోల్ ఫ్రీ నంబరు 1077కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలను సూచించారు. విశాఖ కలెక్టరేట్లో 1800 4250 0002 నంబర్ ను అందుబాటులో ఉంచారు. తుపాన్ ప్రభావం వల్ల చెన్నై-విశాఖపట్టణం-హౌరా మార్గంలో బుధవారం (అక్టోబరు 10) రాత్రి నుంచి పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more