ఏడు పర్యాయాలు మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచి భారత రక్షణ విభాగంలో ఉన్నత హోదాలో కొనసాగుతున్న ఓ అధికారిపై రేప్ కేస్ నమోదైంది. నేవి విభాగంలోని ఉన్నతాధికారిగా కొనసాగుతున్న అధికారి పెళ్లి పేరుతో ఓ అమాయకరాలిపై అనేకపర్యాయాలు అత్యాచారానికి పాల్పడ్డటంతో ఈ కేసు నమోదైంది. కేరళలోని కొట్టాయం జిల్లాలో వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితురాలి తండ్రి పిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అత్యాచార కేసుతో పాటు ఎస్సీ అట్రాసిటీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసిన అధికారులు సదరు అధికారిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే.. ముంబైలో నేవీ చీఫ్ పెట్టీ ఆధికారిగా విధులు నిర్వహిస్తున్న మురళీ కుమార్ పై రేప్ కేసు నమోదైంది. తనను కలిసేందుకు హోటెల్ గదికి వచ్చిన ఓ 20 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిపై అతను అత్యాచారం చేశాడంటూ సదరు మహిళ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హోటెల్ గదికి వచ్చిన అమ్మాయిపై అతి దారుణంగా రేప్ చేసిన నేవీ అధికారి, ఆ విషయం ఎవరికీ చెప్పొందన్ని బెదిరించినట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతిని తన మాటలతో నమ్మించి, హోటల్ గదికి రప్పించుకున్నాడని, రెండు సార్లు మిస్టర్ ఆసియా, ఎనిమిది సార్లు మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచిన మురళి కుమార్ ఫోటోలు చూసి, మనసు పడ్డ యువతి అతన్ని నమ్మి అక్కడికి వెళ్లిందని పోలీసులు చెబుతున్నారు. నేవీ అధికారి పైశాచికత్వం కారణంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగుచూడడం విశేషం. తన కంటే వయసులో 18 ఏళ్లు చిన్నదైన అమ్మాయిపై అఘాయిత్యం చేసిన మురళీ కుమార్ ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తండ్రి పోలీసులను కోరుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more