మిని భారతావనిలా బాసిల్లుతున్న హైదరాబాదులో.. అప్పడప్పుడు కొన్ని అలజడులు చోటుచేసుకున్నాయే తప్ప ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా బాంబు విస్పోటనం సంభవించి ప్రశాంతవాతావరణాన్ని విచ్చినం చేసిన జంటబాంబు పేలుళ్ల కేసులో.. ఇవాళ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కోంటున్న ఐదుగురు నిందితులను విచారించిన న్యాయస్థానం.. కేవలం ఇద్దరిని మాత్రమే దోషులను తేల్చింది.
నిందితులుగా వున్న మరో ముగ్గురిపై ఆధారాలు సరిగ్గా లేవని వారిని నిర్ధోషులగా పేర్కోంది. పదకొండేళ్ల క్రితం హైదరాబాదులో జరిగిన జంట పేలుళ్ల విధ్వంసం కేసులో తీర్పును వెలువరించిన అనంతరం దోషులుగా తేలిన నిందితులకు శిక్షలను రేపు ఖారారు చేయనున్నట్లు తెలిపింది. అనీక్ షఫీక్, అక్బర్ ఇస్మాయిల్ను దోషులుగా నిర్థారిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరి శిక్షలను సోమవారం ఖరారు చేయనున్నారు. సరైన ఆధారాలు లేనందున ఫరూఖ్ షఫ్రుద్దీన్, సాధిక్ ఇసార్ నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. మరో ఉగ్రవాది అంజుమ్పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
2007 ఆగస్టు 25న లుంబినీ పార్కు, కోఠిలోని గోకుల్ఛాట్లో విద్రోహ శక్తులు బాంబులు పేల్చిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో 44 మంది మృతిచెందగా 68మంది పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిట్ బృందం తేల్చింది. రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ సహా పలువురిని నిందితులుగా అభియోగపత్రాల్లో పేర్కొంది. వీరిలో అరెస్టయిన ఐదుగురు చర్లపల్లి కారాగారంలో ఉన్నారు. గత నెల 27న తుది విచారణ జరిపిన న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more