మధ్యప్రదేశ్లో రాజకీయం అప్పుడే వేడెక్కింది. గత మూడు పర్యాయాలుగా అధికారంలో వున్న బీజేపికి ఈ ధఫా ఎన్నికలలో కాంగ్రెస్ షాకిస్తుందని వార్తలు వెలువుడుతున్న క్రమంలో అటు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జన్ అశీర్వాద్ యాత్రను కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడి ప్రజలు అడ్డుకుంటున్నారు. ఇందుకు దీర్ఘకాలికంగా అధికాంలో వున్న బీజేపిపై వ్యతిరేకత ఒక కారణం అయితే అధికారంతో వచ్చిన అహంకారం కూడా మరో కారణం. ఏకంగా బీజేపి నేతలు కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నేతను చంపేస్తానని కూడా బెదిరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాను చంపేస్తానంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు తనదైన శైలిలో బెదిరించాడు. బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవి ఖటిక్ కుమారుడు ప్రిన్స్ దీప్ లాల్ చంద్ ఖటిక్ ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేస్తూ.. ఉపకాశి హట్టాలో సింధియా అడుగుపెడితే చంపేస్తానని హెచ్చరించాడు. ‘‘జ్యోతిరాదిత్య సింధియా.. ఝాన్సీ లక్ష్మీభాయిని చంపిన జివాజీరావు రక్తం నీ నరాల్లో ప్రవహిస్తోంది. నీవు కనుక హట్టాలో అడుగుపెడితే నిన్ను కాల్చి చంపేస్తా. అయితే నువ్వు చస్తావు.. లేదంటే నేను’’ అని తన ఫేస్ బుక్ ఖాతాలో హెచ్చరించాడు.
ఈ నెల 5న సింధియా హట్టా జిల్లాలో ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. హట్టా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమాదేవి కుమారుడి ఫేస్ బుక్ బెదిరింపులతో షాక్కు గురయ్యారు. సింధియా గౌరవనీయ వ్యక్తి అని, తన కుమారుడు అటువంటి హెచ్చరికలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆ పోస్టు తొలగించాల్సిందిగా ప్రిన్స్దీప్ను కోరినట్టు తెలిపారు. ప్రిన్స్ దీప్ బెదిరింపులపై సింధియా కూడా స్పందించారు. బీజేపీ నిజ స్వరూపం ఇదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను సర్వనాశనం చేయడమే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ధ్యేయమని దుయ్యబట్టారు. ఇటువంటి బెదిరింపులకు బయపడేది లేదని తేల్చి చెప్పారు.
కాగా, సింధియాపై బెదిరింపులకు పాల్పడి.. చంపేస్తానంటూ బాహాటంగా ఫేస్ బుక్ ద్వారా హెచ్చరించిన బీజేపి ఎమ్మెల్యే తనయుడు ప్రిన్స్ దీప్ లాల్ చంద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అతని తల్లి, బీజేపి ఎమ్మెల్యే ఉమాదేవి ఖాటిక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన కోడుకు జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. అతను ప్రతిపక్ష నేతపై చేసిన వాఖ్యలకు అతను జైలుకు వెళ్లక తప్పదని.. అందుచేతే తానే స్వయంగా తన తనయుడ్ని పోలీసులకు అప్పగించానని చెప్పారు. ఈ విషయంలో తనకు గానీ, తన పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అందేకాదు జ్యోతిరాధిత్య సింధియాకు అమె క్షమాపణలు కూడా చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more