కర్నూలు జిల్లాలో క్వారీ ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. జిల్లాలోని హత్తిబెళగల్లోని ప్రమాద బాధితులను ఇవాళ ఆయన పరామర్శించారు. అంతకుముందు పేలుడు జరిగిన క్వారీ ప్రాంతానికి వెళ్లిన ఆయన ప్రమాఘస్థలిని పరిశీలించారు. ప్రమాదం ఎలా సంభవించిందన్న విషయాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పోందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో రాష్ట్రంలో అక్రమ గనుల తవ్వకాలు, మైనింగ్ కార్యకలాపాల వల్ల ఇలాంటి ఘోరాలు జరుతున్నాయని, ఇలాంటి ఘటనలు సంభించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇంతటి ఘోరం జరిగినా.. తనకు ఏ మాత్రం పట్టనట్లుగా గనుల శాఖ మంత్రి వ్యవహరించడం దారుణమన్నారు. ఆయన ఏం చేస్తున్నారు.. నిద్రపోతున్నారా అని పవన్ ప్రశ్నించారు. కనీసం బాధిత కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించేందుకు కూడా ఆయన మూడు రోజులైనా తీరిక లేదా.? అని నిలదీశారు. రియల్ టైం గవర్నెన్స్ అంటూ ప్రకటనలు చేసుకుంటున్న చంద్రబాబు.. మరి అక్రమ గనుల వ్యవహారంలో ఏం చేస్తున్నారని.. అసలు పట్టించుకున్న పాపన కూడా పోవడం లేదని దుయ్యబట్టారు.
కర్నూలు జిల్లాలో 1600 క్వారీలకు అనుమతులు ఇచ్చారని, 600కి పైగా అక్రమ క్వారీలు నడుస్తున్నాయని, ఇప్పటికైనా ఇలాంటి అక్రమ క్వారీలను మూసివేయాలని జనసేనాని కోరారు. ఈ అక్రమ క్వారీల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రజలకు ఎనలేని కష్టం, నష్టం ఎదురవుతుందని ఆయన అన్నారు. అలా కాదని మెండిగా తమ దారి తమదేనని వ్యవహరిస్తే జనసేన రంగంలోకి దిగుతుందని, జనసేన కార్యకర్తలే అక్రమ మైనింగ్ కార్యకాలపాలకు చరమగీతం పాడతారని పవన్ హెచ్చరించారు. ప్రజల కష్టాలు చూడలేక అంత దూరం నుంచి వచ్చానన్న పవన్.. కర్నూలు పర్యటనకు వచ్చినపుడు ప్రజా సమస్యలపై మాట్లాడతానని పవన్ కల్యాణ్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more