ఎవరికైనా ఏకంగా ఐదు లక్షల రూపాయాల నగదు అనుకోకుండా దొరికితే ఏం చేస్తారు.. హమ్మయ్య కష్టాలు తీరాయిరా దేవుడా.. అంటూ చట్టుక్కున ఇంటికి తీసుకెళ్తారు. కానీ తాను పెదవాడైనా.. తనకు విద్య వంటబట్టక అటోను నడుపుతూనే జీవనాధారం పోందుతున్న ఓ అటో డ్రైవర్ మాత్రం ఇలా అలోచించలేదు. ఈ ఐదు లక్షలు పోగొట్టుకున్న వాళ్లు ఎంత బాధను అనుభవిస్తున్నారో.. వారు ఎందుకోసం ఈ డబ్బును తీసుకువస్తున్నారో.. ఈ డబ్బును వారికందకపోతే వారి కష్టం ఎలా వుంటుందోనని అలోచించాడు.
పరుల సొమ్ము పాముతో సమానమని భావించిన అటో డ్రైవర్.. అంతకుముందు తాను దిగబెట్టిన కస్టమర్ ఇంటికి వెళ్లి మరీ డబ్బును అందించాడు. ఇలా తన నీతి, నిజాయితీపరుడినని రుజువు చేసుకున్నాడు. అంతేకాదు డబ్బుతో గోప్పదనం రాదని, వ్యక్తిత్వంతో గొప్పవాడిగా మిగలడమే సముచితమని భావించాడు. అంతే ఇతడి నిజాయితీ ముందు పోలీసులు కూడా సలామ్ కొట్టేలా.. అతనికి సన్మానించేలా చేశాయి. ఈ ఘటన మహారాష్ట్రలో కోంధ్వాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశ్ మోతీరాం కరంచందనీ (72) అనే వ్యక్తి గురువారం సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో మార్కెట్యార్డ్ నుంచి తన ఇంటికి ఆటోలో వచ్చాడు. అయితే, తనతోపాటు తెచ్చిన రూ.5 లక్షలు నగదు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయి దిగిపోయాడు. దీన్ని డ్రైవర్ మారుతీ దగడు వాఘ్మేరే (60) కూడా గమనించలేదు. అక్కడ నుంచి ఆటోకు గ్యాస్ నింపడానికి ఫిల్లింగ్ స్టేషన్కు వెళ్లాడు. ఆ సమయంలో వెనుక సీట్లో ఉన్న క్యారీబాగు అతడి కంటపడింది.
దీన్ని పరిశీలించగా అందులో రూ.5 లక్షలు ఉన్నట్టు గుర్తించాడు. దీంతో వెంటనే ప్రకాశ్ మోతీరాం ఇంటికి వెళ్లి నగదు సంచిని వారికి అప్పగించాడు. అప్పటికే ప్రకాశ్ డబ్బు సంచిని ఆటోలో మరిచిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆటో డ్రైవర్ మారుతీ డబ్బులు తీసుకొచ్చిన విషయం కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రకాశ్కు తెలియజేశారు. నిజాయితీతో డబ్బును అప్పగించిన మారుతిని పోలీసులు అభినందించారు. పోలీస్ స్టేషన్కు పిలిపించి అతడిని శాలువతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more