విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్కూల్స్ అరాచకాలకు అడ్డాగా మారుతున్నాయి. యజమాన్యం నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపంగా మారాయి. విద్యార్థులను వక్రమార్గం పట్టకుండా సద్బుద్దులు నేర్పాల్సిన ఉపాద్యాయులే వక్రమార్గం పట్టి విద్యార్థులను లైంగికంగా వేదిస్తుంటే.. ఉపాద్యాయుడి వేధింపులు భరించలేని సదరు విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. ఇవాళ ఉదయం తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ వద్దకు చేరుకుని సమస్యపై నిగ్గదీస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన ఉపాద్యాయుడు పారిపోతుండగా, పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆనక పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన హైదరాబాద్లోని డీడీ కాలనీలో ఉన్న చైతన్య స్కూల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉపాధ్యాయుడు రమేశ్ వెకిలిచేష్టలపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు శుక్రవారం పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయుడు రమేశ్కు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు స్కూల్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఉపాధ్యాయుడిని పోలిస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులతో తల్లిదండ్రులకు వాగ్వాదానికి దిగారు.
ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేస్తామని తల్లిదండ్రులకు పోలీసులు నచ్చజెప్పి ఉపాధ్యాయుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయుడు రమేశ్ ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయంలో పోర్న్ వీడియోలు, చిత్రాలు చూపిస్తూ అలాగే చేయాలని చెప్పేవాడు. గతంలో ఇలాంటి వెలికిచేష్టలు చేయడంతో రమేశ్ ను మందలించి వదిలేశారని తెలుస్తోంది. అతడి వేధింపులకు తాళలేక బాలికలు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడేందుకు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. వీరిని చూసిన రమేశ్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు రమేశ్చ ను పట్టుకుని చితకబాదారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more