విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్కూల్స్ అరాచకాలకు అడ్డాగా మారుతున్నాయి. యజమాన్యం నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపంగా మారాయి. విద్యార్థులను వక్రమార్గం పట్టకుండా సద్బుద్దులు నేర్పాల్సిన ఉపాద్యాయులే వక్రమార్గం పట్టి విద్యార్థులను లైంగికంగా వేదిస్తుంటే.. ఉపాద్యాయుడి వేధింపులు భరించలేని సదరు విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. ఇవాళ ఉదయం తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ వద్దకు చేరుకుని సమస్యపై నిగ్గదీస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన ఉపాద్యాయుడు పారిపోతుండగా, పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆనక పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన హైదరాబాద్లోని డీడీ కాలనీలో ఉన్న చైతన్య స్కూల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉపాధ్యాయుడు రమేశ్ వెకిలిచేష్టలపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు శుక్రవారం పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయుడు రమేశ్కు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు స్కూల్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఉపాధ్యాయుడిని పోలిస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులతో తల్లిదండ్రులకు వాగ్వాదానికి దిగారు.
ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేస్తామని తల్లిదండ్రులకు పోలీసులు నచ్చజెప్పి ఉపాధ్యాయుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయుడు రమేశ్ ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయంలో పోర్న్ వీడియోలు, చిత్రాలు చూపిస్తూ అలాగే చేయాలని చెప్పేవాడు. గతంలో ఇలాంటి వెలికిచేష్టలు చేయడంతో రమేశ్ ను మందలించి వదిలేశారని తెలుస్తోంది. అతడి వేధింపులకు తాళలేక బాలికలు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడేందుకు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. వీరిని చూసిన రమేశ్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు రమేశ్చ ను పట్టుకుని చితకబాదారు.
(And get your daily news straight to your inbox)
Jan 21 | తెలంగాణ అధికార పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తనయ.. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డీలు పరస్పరం బంజారాహీల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. అదేంటి కేకే తనయ విజయలక్ష్మి... Read more
Jan 21 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని న్యాయస్థాన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలను బలపరుస్తూ రాష్ట్రంలో... Read more
Jan 21 | టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై... Read more
Jan 21 | అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండో పర్యాయం బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ను గణనీయమైన ఓట్లతో ఓడించి.. ఆయన... Read more
Jan 21 | దేశ రాజధానిలో తన సత్తాను చాటిన అమ్ ఆద్మీ పార్టీ రెండో పర్యాయం కూడా అధికారంలోకి రాకముందే అటు పంజాబ్, ఇటు హర్యానా సహా పలు రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. పంజాబ్... Read more