టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్పై నిర్భయ కేసు నమోదయ్యింది. శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలను వేధించారన్న ఆరోపణలతో.. నిజామాబాద్లోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఐపీసీ 354, 354ఏ, 342 సెక్షన్లు, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇంట్లో కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది.
సంజయ్ తమను వేధిస్తున్నారంటూ శాంకరి నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినిలు గురువారం పీవోడబ్ల్యూ నేత సంధ్యతో కలిసి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. శాంకరీ కలేజీకి ఛైర్మన్గా వ్యవహరిస్తున్న ఆయన.. ప్రిన్సిపాల్ లేని సమయంలో తమను గదికి రావాలంటూ వేధిస్తున్నారని బాధిత విద్యార్థులు ఆరోపించారు. విచారణ చేపట్టి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ కూడా నిజామాబాద్ సీపీకి విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.
మరోవైపు తనపై వస్తున్న వేధింపుల ఆరోపణలపై సంజయ్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని.. శాంకరి నర్సింగ్ కాలేజీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ కాలేజీని వేరేవాళ్లకు ఇచ్చేశామని.. అక్కడి అడ్మిషన్ల వ్యవహారం కూడా తనకు తెలియదన్నారు. అలాంటప్పుడు అక్కడ చదివే వారు తనకు ఎలా తెలుస్తారని ప్రశ్నించారు. తాను ఎవరితోనూ సహజీవనం చేయడం లేదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగా విద్యార్థినిలతో అలా చెప్పించారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా జరుగుతోందని.. పోలీసుల విచారణకు కూడా సహకరిస్తానని చెప్పారు సంజయ్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more