జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి సమీపంలో ఉన్న తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చక్కెర కర్మాగారం కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ మూతబడటానికి కారణాలను కార్మికులు పవన్కు వివరించారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే దీక్షకు దిగుతామని కార్మికులు పవన్కు చెప్పారు. కార్మికుల దీనస్థితిని తెలుసుకుని చలించిపోయిన పవన్.. వారి సంక్షేమ నిధికి రూ.2 లక్షల విరాళం అందజేశారు. తమ పార్టీ తరఫున మరిన్ని విరాళాలు సేకరించి ఇస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు.
తుమ్మపాల చక్కెర కర్మాగారం మూసివేత కారణంగా 40 నెలల నుంచి జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పవన్ కళ్యాణ్ అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ సమస్యను నాలుగు నుంచి ఆరు వారాల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో కార్మికుల దీక్షకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. కులాల, మతాల ప్రాతిపదికన కాకుండా సమస్యల ప్రాతిపదికన ఉద్యమాలు ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు.
తుమ్మపాల షుగర్స్ కార్మికులను కలసి మాట్లాడతానని తాను ప్రకటించగానే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా ‘తుమ్మపాల అంశంపై సమీక్ష’ అంటూ అమరావతిలో మీటింగ్ పెట్టారని పవన్ విమర్శించారు. ‘రూ.300 కోట్లు విలువచేసే ఫ్యాక్టరీని కేవలం రూ.10 కోట్లకు కాజేయాలని చూస్తున్నారు. ఈ విధమైన దోపిడీని జనసేన చూస్తూ ఊరుకోదు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు, చెరకు రైతులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని పవన్ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more