తన సోదరి, ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ మరణంలో కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిన హత్యేనని అనుమానాలను రేకెత్తిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ తన నోరు విప్పాలి అంటూ ఘాటుగా స్పందించిన సినీనటుడు ప్రకాష్ రాజ్.. ఇక అది మొదలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తరచూ విరుచుకుపడుతున్నాడు. టిప్పుసుల్తాన్ జయంతి ఉత్సవాలను మొదలుకుని బీజేపి నేతలు చేసిన అన్ని విమర్శలను ఆయన ధీటుగా, సమర్థవంతంగా తిప్పికొడుతూ వచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలో బీజేపి పార్టీ అధికారంలోకి వస్తే.. ఇక కర్ణాటక రాష్ట్రంలో మనజాలడం తనకు శ్రేయస్కరం కాదని ఇదివరకే చెప్పిన ప్రకాశ్ రాజ్.. కాలబురాగి ప్రాంతానికి వెళ్లిన తనను బీజేపి కార్యకర్తలు అడ్డుకుని, ఘెరావ్ చేశారని అంతటితో అగని బీజేపి కార్యకర్తలు తన కారుపై రాళ్లతో దాడి చేశారని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపి అధికారంలోకి వస్తే ఇక కర్ణాటక రాష్ట్రంలో ఎలా ప్రశాంతంగా వుండగలమని ప్రశ్నించారు.
ఇక హిందువులు అధికంగా వున్నందున దేశాన్ని హిందుస్తాన్ అని పిలవాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వినూత్నంగా స్పందించారు. హిందువులు ఎక్కువగా ఉన్నారని భారత్ ను హిందూస్తాన్ అని ఎలా పిలుస్తారన్న ఆయన, ఒకవేళ అందుకు సంఖ్యే ప్రామాణికం అనుకుంటే కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలని కోరారు.
జాతీయ పక్షి మయూరాల సంఖ్య కంటే కాకుల సంఖ్యే ఎక్కువ కాబట్టి నెమలికి బదులు కాకినే జాతీయ పక్షిగా ప్రకటించాలని సూచించారు. బెంగళూరులో సామాజిక ఉద్యమకారిణి, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య జరిగిన వెంటనే సంబరాలు చేసుకున్న వారిని ప్రధాని మోదీ ఎందుకు వ్యతిరేకించలేదని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. ఈ విషయంలో ఆయన మౌనంగా ఉన్నందుకే వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలసినన ఇల వైకుంఠపురంగా భక్తుల కొంగుబంగారంగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తిరువేంకటేశ్వరుడికి ఆర్జిత సేవలు నిర్వహించేందుకు భక్తులు అసంఖ్యాకంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు... Read more
Feb 27 | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మూడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒక రకంగా, పశ్చిమ బెంగాల్ ను మరో రకంగా చూడటం... Read more
Feb 27 | తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరుల త్యాగాల మీద అడుగులు వేసుకుంటూ అధికారాన్ని చేపట్టిన కేసీఆర్.. తెలంగాణ అంటే తానొక్కడే అన్న చరిత్రను... Read more
Feb 26 | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు తాజా షెడ్యూల్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ... Read more
Feb 26 | యావత్ దేశం ఇంధన ధరల పెంపుపై భగ్గుమంటోంది. ప్రజలను ఇంధన ధరల పెంపుపై పెదవి విరుస్తుండగా, ఈ ధరాఘాతాన్ని విపక్షాలు తమ తమ స్థాయిలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై అస్త్రాలుగా సంధించుకుంటున్నాయి. ఈ క్రమంలో... Read more