జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీతో కలసి అడుగులు వేసిన వామపక్ష పార్టీలు విజయవాడలో ప్రత్యేకహోదా కోసం శాంతియుతంగా నిర్వహించిన పాదయాత్రతో మళ్లీ తమకు బెజవాడలో పూర్వవైభవం వచ్చిందన్న భావన ఆయా పార్టీలలో నెలకొందన్నడంలో అతిశయోక్తి కాదు. పవన్ కల్యాణ్ పిలుపుకు బెజవాడ యువతతో పాటు అభిమానులు, పార్టీ కార్యకర్తలతో పాటు ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో అనేకమంది పవన్, వామపక్షాలతో కలసి చేసిన పాదయాత్ర సక్సెస్ అయ్యింది. అయితే ముఖ్యనేతలు కార్యక్రమ విజయాలు కాదు తమ ఎందుకు ఈ పాదయాత్ర తలపెట్టామో అ డిమాండ్ నెరవేరితేనే సక్సెస్ సాధించినట్టు అని చెప్పారు.
లక్ష్యం దిశగా అంచెలంచెలుగా పవన్ కల్యాణ్ చేసే పోరాటం.. అంతిమంగా తమకు లక్ష్యం సిద్దించినప్పుడే తమ పోరాటం విజయవంతమైతుందన్న తన అలోచనా ధోరణి పవన్ కల్యాణ్ లో తమకు బాగా నచ్చిన అంశమని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇక వాటి సాధనకోసం ఉద్యమాలు నిర్వహించడం, పోరాటాలలో ముందున్న వామపక్ష పార్టీలులతో మాత్రమే తాను కలసి నడుస్తానని పవన్ స్పష్టం చేయడం తనకు నచ్చిందని అయన అన్నారు. వామపక్షాలు పేదల కోసం పనిచేస్తాయని, ఆ పార్టీల నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉంటారని అన్నారు.
తమతో పని చేస్తానని పవన్ ముందుకొచ్చారని, అందుకే తాము ఆయనతో చేతులు కలిపామని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ మరోసారి ఎన్నికైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. దీంతో ఇప్పుడు తమ పార్టీలపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. కాగా, ప్రత్యేక హోదాను ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధించలేమని, తాము మోదీ హఠావో అనే నినాదంతో ముందుకు వెళతామని అన్నారు. ఏపీలో తమ పార్టీకి మెరుగైన భవిష్యత్ ఉందని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more