దక్షిణాదిన ఎలాగైనా తన సత్తాను చాటాలని భావిస్తున్న ప్రధాని మోడీ, షా ద్వయం.. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను టార్గెట్ చేసిన బీజేపి ఆయన అవినీతిపరుడని అరోపణలు చేసింది. అయితే కన్నడీగులు మాత్రం యడ్డీ హాయంలోని బీజేపి ప్రభుత్వం కన్నా సిద్దూ నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనే బాగుందని అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే ప్రీఫోల్ సర్వేలు, సిద్దూకు అనుకూల వాతావరణం రాష్ట్రంలో నెలకొందని స్పష్టం చేసింది
దీంతో ఎలాగైనా సిద్దూను అవినీతిపరుడని ముద్రవేస్తే తప్ప.. తమ పార్టీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని భావనకు వచ్చిన కేంద్రం.. సిద్దూ సర్కార్ ను సరిగ్గా ఎన్నికల వేళ.. ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తూ ఆదాయ పన్ను నోటీసులు పంపింది. మార్చి 31తో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరి త్రైమాసికంలో రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చేసిన భారీ చెల్లింపుల వివరాలను తమకు పంపాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు ఐటీ నోటీసులు అందాయి.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఖర్చు పెట్టేలా పలువురు కాంట్రాక్టర్లకు సిద్దరామయ్య ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు చెల్లించిందనే బీజేపీ నేతల ఆరోపణల నేపథ్యంలో ఐటీ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మే 12న ఒకే విడతలో జరగనున్న కర్ణాటక ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున డబ్బులను ఖర్చు చేసేందుకు గాను కాంట్రాక్టర్లుకు నిధుల వరద పారించిందని తమకు సమాచారం అందినట్టు సిద్దూ ప్రభుత్వానికి ఈనెల 6న పంపిన నోటీసుల్లో ఐటీ శాఖ పేర్కొనడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు వివిధ ప్రభుత్వ శాఖలు కాంట్రాక్టర్లకు చెల్లించిన వివరాలను తమకు అందించాలని నోటీసుల్లో పేర్కొంది.
కాగా ఈ నోటీసులపై స్పందించిన రత్నప్రభ.. అన్ని వివరాలను అందించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, ఐటీ శాఖకు అన్ని వివరాలూ అందజేస్తామని మీడియాకు తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలు ఏ రూపంలో ఉన్నా సహించవద్దని కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే కేంద్రంలో అధికారంలో వున్న ప్రధాని, అమిత్ షాలు అనేక పర్యాయాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఓ వైపు వస్తూనే వుండగా, ఇటు ఐటీ, సిబిఐ, ఈడీ తదితర సంస్థలను కూడా కేంద్రం తమకు అనుకూలంగా వినియోగించుకుంటుందన్న అరోపణలు వినబబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more