నకిలీ వార్తలను పత్రికల్లో ప్రచురించడం, టీవీల్లో ప్రసారం చేయడం వంటి చర్యలకు పాల్పడితే అందుకు బాధ్యులైన జర్నలిస్టులపై తీసుకునే చర్యలకు సంబంధించిన బిల్లును తీసుకువచ్చేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఈ తరహా చర్యలకు కేంద్రం పూనుకోవడం ప్రతికాస్వేఛ్చకు భంగం కలిగించడమేనని దేశవ్యాప్తంగా జర్నలిస్టులు నుంచి వ్యతరేకత ఉత్పన్నం కావడంతో.. మోడీ సర్కార్ వెనక్కుతగ్గింది. సరిగ్గా ఎన్నికల సంవత్సరంలో ఇలాంటి చర్యలకు పూనుకుని మీడియాతో దూరం పెంచుకోవడం సహేతుకం కాదన్న పలువురు రాజకీయ మిత్రపక్షాలు కూడా సూచించాయని సమాచారం.
ఇక దీంతో పాటు కేంద్రమంత్రుల సూచనలను కూడా పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా జర్నలిస్టులు తప్పుడు వార్తలను రాసిన పక్షంలో వారిపై చర్యలు తీసుకునే అంశంలో పలువురు ప్రముఖ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలతో చర్చించిన తరువాత అందిరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని.. కేంద్రం ఈ చర్యలను ఉపసంహరించుకుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. జర్నలిస్టులకు పత్రికాస్వేచ్ఛ కల్పించాలన్న ఆయావర్గాల సంఘాల నేతలతో ఏకీభవించిన కేంద్రప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని వివరించారు.
అయితే అంతకుముందు తప్పుడు వార్తలను రాసిన పక్షంలో సదరు జర్నలిస్టు అక్రెడిటేషన్ రద్దు చేయాలని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. తమకు ఏదైనా ఒక వార్త నకిలీది అని ఫిర్యాదు వస్తే వాటిని ప్రింట్ మీడియా అయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, ఎలక్ట్రానిక్ మీడియా అయితే న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్కు రిఫర్ చేస్తామని పేర్కొంది. ఆయా సంస్థలు 15 రోజుల్లో ఈ ఫిర్యాదులపై విచారణ పూర్తి చేస్తాయని, ఆ సమయంలో జర్నలిస్ట్ అక్రెడిటేషన్ సస్పెన్షన్లో ఉంటుందని, ఆ వార్త తప్పని తేలితే చర్యలు ఉంటాయని చెప్పింది. తొలిసారి ఉల్లంఘనకు పాల్పడితే ఆరు నెలలు, రెండోసారి మళ్లీ ఫేక్ న్యూస్ రాస్తే ఏడాది పాటు, మూడవసారి ఉల్లంఘన అయితే శాశ్వతంగా అక్రెడిటేషన్ రద్దు చేస్తామని తేల్చి చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more