మారిటల్ రేప్.. భార్యలైయినా సరే వారి అనుమతి, సమ్మతి లేకుండా బలవంతంగా శృంగారం నెరిపడం కూడా అత్యాచారమేనంటూ ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా తీర్పునిచ్చి.. అయితే ఇందుకు కొన్ని మార్గదర్శకాలను కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా గుజరాత్ హైకోర్టు తీర్పును వెలువరించింది. భార్యలతో బలవంతపు శృంగారం తప్పేమీ కాదని తీర్పును వెలువరించింది. అసలు మారిటల్ రేప్ అన్నదే అన్యాయమని.. ఇలాంటి అక్షేపణలను పేర్కొంటు న్యాయస్థానాలకు వచ్చే వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని మండిపడుతూ.. తీర్పును వెలువరించింది.
భార్య అనుమతి లేకుండా చేసే శృంగారం వైవాహిక అత్యాచారం కాదని స్పష్టం చేస్తూ తీర్పును వెలువరించింది. అయితే, ఓరల్ సెక్స్ (నోటి ద్వారా), అసహజ మార్గాల్లో జీవిత భాగస్వామితో శృంగారం కోరుకుంటే అది క్రూరత్వంగా పరిగణించాల్సిందేనని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు తన భర్త తనపై అత్యాచారం చేశాడని, హింసించాడని పేర్కోంటూ న్యాయస్థానాన్ని అశ్రయించిన ఓ మహిళా డాక్టర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘ఓ వ్యక్తి, జంతువు మధ్య జరిగే లైంగిక చర్య, ఇద్దరు పురుషుల మధ్య జరిగే, అసహజ మార్గంలో జరిగే లైంగిక చర్యల వంటి విపరీత ప్రవర్తనలని పేర్కోంది.
అలాంటివి మినహాయిస్తే మిగిలినవేవి ఐపీసీలోని సెక్షన్ 377 కిందకు రావని హైకోర్టు పేర్కొంది. పిటిషన్ దాఖలు చేసిన మహిళా వైద్యురాలు, తన భర్త తన ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక కార్యం కోసం, ఓరల్ సెక్స్ కోసం బలవంతం చేస్తున్నాడని కోర్టుకు తన బాధను తెలియజేశారు. అయితే, ఈ ఫిర్యాదును తిరస్కరిస్తూ సెక్షన్ 376 కింద అత్యాచార ఆరోపణలపై ఆమె భర్తను విచారించడం కుదరదని జస్టిస్ జేబీ పార్ధీవాలా పేర్కొన్నారు. వైవాహిక జీవితంలో అత్యాచారం గురించి ఇందులో పేర్కొనలేదన్నారు. కాకపోతే అసహజ లైంగిక ఆరోపణలతో సెక్షన్ 377 కింద ఆమె పిటిషన్ వేసుకోవచ్చని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more