దేశరాజధానిగా బాసిల్లుతున్న నగరం.. నిత్యం రద్దీగా వుండే ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన పెద్దని బిల్ బోర్డులలో ప్రసారమైన అసభ్యకర, అశ్లీల దృశ్యాలే ఇందుకు కారణమయ్యాయి. అందులోనూ అది రహదారి కావడం.. అటుగుండానే వేలాది మంది నిత్యం ప్రయాణాలు సాగిస్తుండటంతో సంచలనకరంగా మారింది. దీంతో ఆ రహదారి మీదుగా వెళ్తున్న ఒంటరి ప్రయానికులతో పాటు కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందికి గురయ్యాయి.
ఈ ఘటన ఫిలిప్పీన్స్ ఆర్థిక రాజధాని మకాటి ప్రధాన రహదారి మధ్యలో వాహన చోదకులు, పాదచారులతో రద్దీగా ఉన్న ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడే ఓ పెద్ద భవనంపై ఏర్పాటు చేసిన భారీ ఎలక్ట్రానిక్ బిల్ బోర్డ్ (ప్రకటనల బోర్డు) పై ప్రకటన స్థానంలో అశ్లీల దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఒక్కసారిగా వీటిని చూసిన స్థానికులు నివ్వెరపోయారు. ఈ దృశ్యాలు సుమారుగా అర నిమిషం పాటు ప్రత్యక్షమయ్యాయని వాహనదారులు తెలిపారు. కొందరు వీటిని తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.
ఈ అశ్లీల దృష్యాల ప్రసారంతొ మాకాటిలోని సిటీ సెంటర్ ప్రాంతంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీనిపై ఫిర్యాదులందడంతో మకాటి మేయర్ అబిగేల్ బినయ్ విచారణకు అదేశించారు. బిల్ బోర్డుపై ప్రసారాల నిర్వహణ వ్యవహారాలను చూస్తున్న గ్లోబల్ ట్రానిక్స్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్ బోర్డ్ ను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎవరో అగంతకులు టీమ్ వ్యూవర్ అనే సాప్ట్ వేర్ తో రహస్య ప్రాంతం నుంచి ఈ అశ్లీల దృశ్యాలను ప్రసారం చేశారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సాప్ట్ వేర్ తో డెస్క్ టాప్ షేరింగ్, అన్ లైన్ సమావేశాలు, ఫైల్ ట్రాన్స్ ఫర్, సహా ఎక్కడి నుంచైనా కంప్యూటర్లను రహస్యంగా కనెక్ట్ అయ్యే అవకాశాలు వున్నాయని అధికారులు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more