same scene repeats on 5th day in loksabha డైలీ సీరియల్ ను తలపిస్తున్న అవిశ్వాస ఎపిసోడ్

Lok sabha adjourned for 5th day without discussion on no trust motion

TDP, YSRCP, no confidence motion, council of minister, prime minister, PM Modi, Union Govenment, Andhra pradesh, special status, congress, trinamul congress, left parties, national congress party, biju janatadal, andhra pradesh special status, TRS, AiADMK, BJP, chandrababu, vishnu kumar raju, JanaSena, corruption, andhra pradesh, politics

The Lok Sabha proceedings were disrupted by the TRS, AIADMK party for the fifth day on thursday. Lok Sabha Speaker Sumitra Mahajan disallowed for the fifth time no-confidence motions against the government, citing a disorderly House.

డైలీ సీరియల్ ను తలపిస్తున్న అవిశ్వాస ఎపిసోడ్

Posted: 03/22/2018 02:09 PM IST
Lok sabha adjourned for 5th day without discussion on no trust motion

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు విభజన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై అధికార టీడీపీ, విపక్ష టీడీపీ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణం డైలీసీరియల్ ఎపిసోడ్ ను తలపిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలోకి రావడం… గంధరగోళం మధ్య అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టలేనని చెప్పి వాయిదా వేసి వెళ్లిపోవడాన్ని గత ఐదు రోజులుగా చూస్తున్న దేశప్రజలకు మరీ ముఖ్యంగా దక్షిణాధి ప్రజలకు ఇది రుచించడం లేదు.

కావేరీ బోర్డు ఏర్పాటుపై అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో నిమిషాల్లోనే లోక్‌సభ వాయిదా పడుతోంది. ఈ క్రమంలో మరుసటి రోజున అవిశ్వాస తీర్మాణంపై చర్చ జరపాలని టీడీపీ, వైసీపీ ఎంపీలు నోటీసులు కూడా ఇస్తూనే వున్నారు. ఈ నేపథ్యంలో ఇదే సీన్ ప్రతిరోజూ ఉత్పన్నం కావడంతో బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు ఇక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు కనబడవన్న వాదనలు కూడా వినబడుతున్నాయి.

అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ఐదో రోజూ అదే పరిస్థితిలు ఉత్పన్నమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలు ఆందోళనకు దిగారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ప్రారంభంచమని చెబుతుండగానే తమ సమస్యలకు పరిష్కారానికి కోరుతూ రెండు పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. మరో వైపు టీడీపీ, వైసీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబట్టినా ఫలితం లేకపోయింది. దీంతో సభ ప్రారంభమైన నిమిషంలోపే వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్.

ఇక వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైన పరిస్థితి మారలేదు… స్పీకర్ ఎంత సర్దిచెప్పినప్పటికీ అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు పట్టువీడలేదు… వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ఇస్తూ నిరసనకు దిగారు. పార్లమెంటు వ్యవహరాల శాఖా మంత్రి అనంత్‌కుమార్ నిరసనలు విరమించాలని, అన్ని సమస్యలపై కేంద్రం చర్చిస్తుందని విన్నవించారు. సభ్యులు సహకరిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామన్నారు.

ఈ సమయంలోనే మరికొంత మంది ఎంపీలతో మాట్లాడించే ప్రయత్నం స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసినా.. అవిశ్వాసంపై చర్చకు మాత్రం జరగలేదు. దీంతో తమ అవిశ్వాస తీర్మాణాలపై ముందుగా చర్చ జరపాలని టీడీపీ, వైసీపీ ఎంపీలు తమ స్థానాల్లో నిలిచొని నిరసన వ్యక్తం చేశారు… ఓ వైపు టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనతో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారానికి వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  YSRCP  no confidence motion  TRS  AiADMK  BJP  PM Modi  sushma swaraj  Andhra pradesh special status  

Other Articles