పేద ప్రజలకు ఉచిత ఆరోగ్యబీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన నరేంద్రమోడీ ప్రభుత్వం అదిశగా తొలి అడుగు వేసింది. పేద ప్రజలకు అందించే ఉచిత అరోగ్య బీమా పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ఏర్పాటు చేసింది. దీని ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అమోదం కూడా తెలిపింది. దీంతో ఈ పథకాన్ని త్వరలోనే అములును నోచుకోనుంది.
ఆయుష్మాన్ భారత్ మినష్ అధ్వర్యంలో పేదలు, బడుగువర్గాల ఆరోగ్య బీమా వ్యవహరాలను చూస్తుంది. కేంద్రం వద్దనున్న సోషల్ ఎకానమీ డాటా బేస్ లో పొందపర్చిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఏకంగా 10 కోట్ల పేద, బడుగు, బలహీనవర్గాల కుటుంబాలకు ఇక వైద్య చింత వీడినట్టే. అయితే ఈ భీమా ప్రీమియం కోసం ప్రతీ కుటుంబం ఏడాదికి రూ. రెండు వేల రూపాయలను చెల్లించాల్సి వుంటుంది.
అయితే ఆ ప్రీమియం చార్జీలు కూడా వారిపై పడకుండా.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. ప్రీమియంలోని మొత్తంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరిస్తాయి. దీంతో ఒక్కో కుటుంబం మొత్తానికి ఒక ఏడాదిలో రూ.5 లక్షల ఆరోగ్యబీమా అందనుంది. అయితే ఈ బీమాలో కుటుంబాలకు సంబంధించిన వక్యుల ఎంతమంది. వారి వయస్సు ఎంత అన్న వివరాలతో సంబంధం లేకుండా కుటుంబంలోని సభ్యులందరీకీ వర్తించనుంది. ఇక దీనితో పాటు ఇప్పటికే బాధపడుతున్న వ్యాధులకు కూడా ఈ భీమా పథకంలో కవరేజి కల్పించనుంది కేంద్రం.
ఈ పథకం నిర్వహణకు ఏటా రూ.10,000 కోట్లు వ్యయం అవుతాయని అంచనా. కాగా, కేంద్రం తీసుకువచ్చిన జన్ దన్ యోజనా పథకం మాదిరిగా ఈ అయుష్మాన్ పథకం మారకుండా చూడాలిన పలువరు కోరుతున్నారు. ఇక మరికోందరు మాత్రం దేశానికి అదాయాన్ని సమకూర్చుతున్నవారితో మధ్యతరగతి వారే అధికమని.. ఈ పథకాలను మధ్యతరగతి వర్గాలకు కూడా విస్తరింపజేయాలని కేంద్రాన్ని విన్నవిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more