టీడీపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాన్ అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని.. అయితే అలాంటి వ్యక్తిపై కూడా టీడీపీ అనుచిత విమర్శలు చేస్తూ.. ఆయన చర్యలను తప్పుబటడం కూడా తప్పేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబుకు మంచోడిగా వున్న పనవ్ కల్యాన్ అయన ప్రభుత్వ హాయంలో జరుగుతున్నఅవినీతిని ప్రశ్నించగానే చెడ్డవాడిగా మారిపోయాడా..? అన్ని ప్రశ్నించారు.
జనసేన అధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిజనిర్థారణ కమిటీలో పోలవరం ప్రాజెక్టుపై కూడా కేంద్రం ఇచ్చిన నిధులు, అక్కడ జరుగుతున్న పనులపై చర్చించామని చెప్పిన ఆయన అసలు ఈ ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ స్థితి ఏర్పడిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఏ రోజుకారోజు కేంద్రానికి లెక్కలు పంపుతున్నామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం.. అసలు పోలవరం నిర్మాణం, చెల్లింపులపై ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం జరగలేదని విషయాన్ని తమ చర్చల వల్ల తెలుసుకున్నామని ఉండవల్లి వెల్లడించారు.
అంతేకాదు పోలవరంపై ఇప్పటివరకు జరిగిన ఏడు సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకురాకపోవడం వెనుక అంతర్యమేమిటో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు ఉండవల్లి. ఇక పోలవరం పరిహారం చెల్లింపుల విషయంలో కూడా అక్రమాలు జరిగాయని తమ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ చర్చల్లో భాగంగా తెలిందని అన్నారు. తడ్వాయి, చెల్లవారి గూడెంలో 1300 ఎకరాల పోరంబోకు భూములకు కూడా పరిహారం చెల్లించారన్న అరోపణలు వున్నాయని అయన తెలిపారు.
అయితే త్వరలోనే తాను పొలవరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని విషయాలను బయటపెడతానని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా అవిశ్వాస తీర్మాణంపై అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదని విమర్శించారు. ఇక పనిలోపనిగా చంద్రబాబుకు నేరుగా ప్రశ్న సంధించిన ఉండవల్లి.. మోడీతో ఆయనకు ఉన్నది మిత్రృత్వమో లేక శత్రుత్వమో ఆయనే భయపెట్టాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more