జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ కేంద్రానికి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో, ఎక్కడ అన్యాయం జరిగిందన్న విషయంలో సత్యాన్వేషణ దిశగా ఇవాళ తొలి అడుగువేస్తున్నారు. సంయుక్త నిజనిర్ధారణ కమిటీ అద్వర్యంలో అటు జయప్రకాష్ నారాయణ, ఇటు ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో పలువురు మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీల నేతలతో పవన్ కల్యాన్ ఇవాళ హైదరాబాద్ నగరంలోని దసపల్లా హోటళ్లో తొలి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇవాళ రాష్ట్రానికి వచ్చిన ప్యాకేజీ నిధుల అంశంమై చర్చించనున్నారని సమాచారం.
కాగా, జేఎఫ్సి (జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ) సమవేశానికి బయలుదేరే ముందు జనసేనాని ట్యాంకు బండుపైనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అయితే పవన్ వస్తున్నారని తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు వందలాది సంఖ్యలో ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోగా, ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పవన్ రాక సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జనసేన కార్యాలయం నుంచి వందలాది మంది అభిమానులు పవన్ కల్యాన్ తో.. కలసి కేరింతలతో వెంట వచ్చారు. ట్రాపిక్ ఇబ్బందుల నేపథ్యంలో పవన్ కల్యాన్ మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెనుదిరిగారు.
పవన్ చొరవతో ఏర్పాటు అవుతున్న ఈ సమావేశంలో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు మధు, నారాయణ, కాంగ్రెస్ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ తదితరులు పాల్గొంటారు. ఇక కొంతమంది ఆర్థిక, విద్య, న్యాయ నిపుణులను సైతం పవన్ ఆహ్వానించారని, వారు కూడా సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more