Opposition targets PM Modi for PNB scam లూటీ చేసి పారిపోయే పారిశ్రామిక వేత్తలకు మోడీ సర్కార్ సహకారం

Pnb fraud congress targets pm for nirav modi s presence in davos meeting

keywords" content="pnb fraud, nirav modi scandal, nirav modi, ami modi, nirav modi jewels, priyanka chopra

Congress president Rahul Gandhi has targeted Prime Minister Narendra Modi for the presence of Nirav Modi in a Indian business delegation in Davos. He said "being seen with the Prime Minister helped the businessman flee the country."

లూటీ చేసి పారిపోయే పారిశ్రామిక వేత్తలకు మోడీ సర్కార్ సహకారం

Posted: 02/15/2018 09:57 PM IST
Pnb fraud congress targets pm for nirav modi s presence in davos meeting

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం దేశ చరిత్రలోనే అతిపెద్ద ‘బ్యాంకు స్కామ్’ అని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఆ పార్టీకి అనుకూలురైన ఇద్దరు దేశం దాటి వెళ్లారని, అయినా కేంద్ర ప్రభుత్వం చేష్టలుడికి చూస్తుండిపోయిందని విమర్శించారు. బీజేపికి అండదండలు అందించే బడా పారిశ్రామిక వేత్తలకు మోడీ సర్కార్ రక్షణ కల్పిస్తూ.. వారిని విదేశాలకు తరలించే బాద్యతలను కూడా తీసుకుంటుందని కాంగ్రెస్ తీవ్రంగా దుయ్యబట్టింది.

లూటీ చేయడం, పారిపోవడం అనేది మోదీ సర్కారుకు ‘హాల్‌ మార్కు’గా మారిపోయిందని ఎద్దేవా చేసింది. జువెలరీ డిజైనర్‌ నీరవ్‌ మోదీ పీఎన్‌బీకి రూ.11,346 కోట్లకు టోకరా వేసి దర్జాగా పారిపోతే.. మోదీ సర్కారు క్షేమంగా వెళ్లండంటూ దగ్గరుండి పంపించిందని ఆరోపించింది. లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యాల్లా నీరవ్‌ కూడా దేశం వీడి వెళుతుంటే సర్కారు ఏం చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిలదీశారు. ‘దేశాన్ని లూటీ చేయడానికి నీరవ్‌ మోదీ చూపిన దారి.. 1.ప్రధాని మోదీని కౌగిలించుకోవాలి. 2. దావోస్‌లో ఆయనతో ఫొటో దిగాలి. దాన్ని వాడుకొని 12 వేల కోట్లు కొట్టేయాలి. మాల్యాలాగా దేశం విడిచి పారిపోవాలి. ప్రభుత్వం మాత్రం పట్టించుకోదు’ అని రాహుల్‌ ట్విటర్‌లో విమర్శించారు. దావోస్‌లో ప్రధానితో కలిసి నీరవ్‌ దిగిన ఫొటోను కూడా జతచేశారు.
 
లలిత్‌ మోదీని ‘చోటా మోదీ-1’గా, నీరవ్‌ మోదీని ‘చోటా మోదీ-2గా’ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అభివర్ణించారు. నీరవ్‌, అతని బంధవులపై చర్యలు తీసుకోవాలంటూ 2016లోనే ప్రధాని కార్యాలయం రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్ కు కూడా సూచించిందని, చివరికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. నీరవ్‌ జనవరి 1నే దేశం విడిచి వెళ్లగా.. జనవరి 31న అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లుక్ అవుట్‌ నోటీసులు జారీ చేశారని, ‘అంటే అతనికి ప్రభుత్వమే ఉప్పందించిందా’ అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles