పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం దేశ చరిత్రలోనే అతిపెద్ద ‘బ్యాంకు స్కామ్’ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఆ పార్టీకి అనుకూలురైన ఇద్దరు దేశం దాటి వెళ్లారని, అయినా కేంద్ర ప్రభుత్వం చేష్టలుడికి చూస్తుండిపోయిందని విమర్శించారు. బీజేపికి అండదండలు అందించే బడా పారిశ్రామిక వేత్తలకు మోడీ సర్కార్ రక్షణ కల్పిస్తూ.. వారిని విదేశాలకు తరలించే బాద్యతలను కూడా తీసుకుంటుందని కాంగ్రెస్ తీవ్రంగా దుయ్యబట్టింది.
లూటీ చేయడం, పారిపోవడం అనేది మోదీ సర్కారుకు ‘హాల్ మార్కు’గా మారిపోయిందని ఎద్దేవా చేసింది. జువెలరీ డిజైనర్ నీరవ్ మోదీ పీఎన్బీకి రూ.11,346 కోట్లకు టోకరా వేసి దర్జాగా పారిపోతే.. మోదీ సర్కారు క్షేమంగా వెళ్లండంటూ దగ్గరుండి పంపించిందని ఆరోపించింది. లలిత్ మోదీ, విజయ్ మాల్యాల్లా నీరవ్ కూడా దేశం వీడి వెళుతుంటే సర్కారు ఏం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. ‘దేశాన్ని లూటీ చేయడానికి నీరవ్ మోదీ చూపిన దారి.. 1.ప్రధాని మోదీని కౌగిలించుకోవాలి. 2. దావోస్లో ఆయనతో ఫొటో దిగాలి. దాన్ని వాడుకొని 12 వేల కోట్లు కొట్టేయాలి. మాల్యాలాగా దేశం విడిచి పారిపోవాలి. ప్రభుత్వం మాత్రం పట్టించుకోదు’ అని రాహుల్ ట్విటర్లో విమర్శించారు. దావోస్లో ప్రధానితో కలిసి నీరవ్ దిగిన ఫొటోను కూడా జతచేశారు.
లలిత్ మోదీని ‘చోటా మోదీ-1’గా, నీరవ్ మోదీని ‘చోటా మోదీ-2గా’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అభివర్ణించారు. నీరవ్, అతని బంధవులపై చర్యలు తీసుకోవాలంటూ 2016లోనే ప్రధాని కార్యాలయం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కు కూడా సూచించిందని, చివరికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. నీరవ్ జనవరి 1నే దేశం విడిచి వెళ్లగా.. జనవరి 31న అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారని, ‘అంటే అతనికి ప్రభుత్వమే ఉప్పందించిందా’ అని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more