కార్పొరేట్ ఆసుపత్రుల అగడాలు రోజుకోక్కటి వెలుగులోకి వస్తున్నా.. వారిలో మాత్రం కనీసం మార్పు రావడం లేదు. ప్రజాధనంతో వైద్యవిద్యను అభ్యసించామన్న కనీస కృతజ్ఞత కూడా లేకుండా అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులను నారాయణలుగా పొల్చుతూ.. దేవుళ్లుగా పరిగణిస్తూ.. రోగులు, వారి బంధువులు వ్యవహరిస్తుంటే.. వారు మాత్రం తాము నారాయణులమని, తమకంతా ధనంతోనే కానీ మనుషులతో పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఓ గర్భిణి పట్లు కార్పోరేట్ అసుపత్రి వ్వవహరించిన ఘటన బట్టబయలైంది. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఓ గర్భవతికి 22 రోజుల పాటు చికిత్స చేసినందుకు గాను ఏకంగా రూ.18లక్షల బిల్లు వేసి తమ ధనదాహాన్ని తీర్చుకుంది ఓ కార్పోరేట్ అసుపత్రి. హర్యాణాలోని ఫరీదాబాద్ ఏషియన్ అసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రోగి బంధువులు ఆందోళన చేపట్టారు.
వివరాల్లోకెళ్తే.. హర్యాణలోని ఫరిదాబాద్ లోని ఏషియన్ ఆసుపత్రిలో జర్వంతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ చేర్పింది. ‘టైఫాయిడ్ వచ్చిందని చెప్పి వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూలో పెట్టారు. అనంతరం ఆమెకు గర్భస్రావం అయిందని, వెంటనే ఆపరేషన్ చేసి పిండాన్ని బయటకు తీయాలని చెప్పి రూ.3లక్షలు కట్టమన్నారు. 22 రోజుల పాటు ఆమెకు చికిత్స అందించినప్పటికీ.. ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఇక చివరకు రూ. 18 లక్షల బిల్లును కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లలాని అసుపత్రి వర్గాలు అదేశించాయి.
దీంతో ఖంగుతిన్న రోగి బంధువులు.. ఆపరేషన్కు ముందే రూ.12లక్షల చెల్లించామని, అయినా తమ వారి ప్రాణాలు దక్కలేదని అరోపించిన బంధువులు ఇప్పుడు ఏకంగా మరో అరు లక్షల రూపాయలను చెల్లించి రోగి మృతదేహాన్ని తీసుకెళ్లాలని అస్పత్రి వర్గాలు చెబుతున్నాయని రోగి తరపు బంధువు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ యాజమాన్యం తీరుపై విచారణ చేపట్టాలని, 22 రోజులకు రూ.18లక్షల బిల్లు ఎలా వేస్తారంటూ ఆమె బంధువులు ఆందోళన చేస్తున్నారు.
Haryana: A pregnant woman, suffering from fever, died at Faridabad's Asian Hospital. Hospital administration handed over bill of Rs 18 Lakh to her family for a 22-days treatment. Relatives demand an investigation against hospital administration. (08.01.2018) pic.twitter.com/hKY1yLgUSj
— ANI (@ANI) January 11, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more