Ycp leader shocks chandrababu at pulivendula పులివెందులలో చంద్రబాబుకు వైసీపీ నేత షాక్

Ycp leader shocks chandrababu on dias at pulivendula

Andhra Pradesh, Telugu Desam Party, Government Officials, Chandrababu Naidu, cuddapah, pulivendula constituency, Janma bhoomi, TDP Cadre

Andhra pradesh chief minister Chandrababu naidu enters opposition leader constituency pulivendula giving shock to ycp leaders but gets retard from one of the opposition party leader on dias.

పులివెందులలో చంద్రబాబుకు వైసీపీ నేత షాక్

Posted: 01/03/2018 04:46 PM IST
Ycp leader shocks chandrababu on dias at pulivendula

ఓ వైపు అంధ్రప్రదేశ్ విఫక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రతో రాష్ట్ర ప్రర్యటన చేసి.. ప్రజాసమస్యలను తెలుసుకుంటున్న నేపథ్యంలో.. అవకాశాలను అందిపుచ్చుకుని మరీ రాష్ట్ర ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీ తీరుపై ఆయన విమర్శలను ఎక్కుపెడుతున్నారు. మరోవైపు తన బ్రాండుగా చెప్పుకునే జన్మభూమి కార్యక్రమంతో జగన్ ఇలాకాలోకి అడుగుపెట్టి.. ప్రత్యర్థి పక్షానికి చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు.

అయితే జగన్ నియోజక వర్గంలోకి వెళ్లిన చంద్రబాబుకు కూడా షాక్ తగిలింది. జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు వేదికపై ఉండగా వైసీపీ నేత ఒకరు వేదికపైకి వచ్చి ప్రసంగం ఇవ్వాలని చూశారు. మైకు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట నిలబడి వైఎస్.రాజశేఖర్ రెడ్డిని పొగిడారు. కడప జిల్లాలో వైఎస్సార్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. దీంతో వేదికపై గందరగోళం చెలరేగింది.

దీంతో ఆయన మైకును కట్ చేశారు. దీనిపై కల్పించుకున్న చంద్రబాబు ఈ వేదికపై ఎటువంటి రాజకీయాలు చేయకూడదని అన్నారు. వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలను కూడా తాను ఈ వేదికపై ఖండించబోనని అన్నారు. అందరూ విలువలతో నడుచుకోవాలని అన్నారు. మంచి పని కోసం తాను పులివెందులకు వచ్చానని, ఈ సమయంలో రాజకీయ విషయాలను మాట్లాడకూడదని హెచ్చరించారు. తాను రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ‌గా చేస్తాన‌ని అన్నారు. అందుకోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles